ఏపీలో 1,896 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నేటినుంచే అప్లికేషన్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం పశు సంవర్థక శాఖలో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలచేసింది. మొత్తం 1,896 పోస్ట్ ల కోసం నవంబర్ 20 నుంచి డిసెంబర్ 11 వరకూ అభ్యర్థులనుంచి దరఖాస్తులు స్వీకరించనుంది.

New Update
ఏపీలో 1,896 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నేటినుంచే అప్లికేషన్

AP Jobs : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సచివాలయాలకు అనుబంధంగా ఉన్న వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 1,896 గ్రామ పశుసంవర్ధక సహాయకులు (VAHA) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 20 నుంచే మొదలుకానుండగా డిసెంబర్‌ 11వ తేదీ వరకు కొనసాగనుంది.

అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపికచేయనుండగా పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను డిసెంబర్‌ 27న రిలీజ్ చేయనన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అలాగే డిసెంబర్‌ 31వ తేదీన కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన వారికి జనవరిలో నియామక పత్రాలు అందిస్తారు. నెలకు వేతనం రూ.22,460 వరకు జీతంగా చెల్లిస్తారు. అయితే ఎంపికై తర్వాత మొదటి రెండేళ్లు ప్రొబేషన్‌ ఉంటుంది. ప్రొబేషన్‌ సమయంలో రూ.15 వేల చొప్పున కన్సాలిడేషన్‌ పే చేస్తారు. ఆ తర్వాత నుంచి నెలకు రూ.22,460 చొప్పున జీతం ఇస్తారు.

Also read :వైద్య సంస్థల్లో 487 పోస్టులు.. ఫ్రీ అప్లికేషన్ వివరాలివే

అభ్యర్థులు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతలు, ఇతర వివరాలు నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు. దరఖాస్తు రుసుము డిసెంబర్‌ 10వ తేదీలోగా చెల్లించాలి. ఇక ఇప్పటికే సచివాలయాలకు అనుబంధంగా గ్రామ స్థాయిలో 10,778 వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు సేవలందిస్తున్న విషయం తెలిసిందే. స్థానికంగా ఉండే పశు సంపద ఆధారంగా 9,844 వీఏహెచ్‌ఏలు అవసరమని ప్రభుత్వం గుర్తిచింది. దీంతో ఈ పోస్టులను రెండు విడతల్లో భర్తీ చేయాలని నిర్ణయించింది. ఆ ప్రకారంగా రెండు విడతల్లో 4,643 ఆర్బీకేల్లో వీఏహెచ్‌ఏలను నియమించారు. రేషనలైజేషన్‌ ద్వారా గ్రామ పరిధిలో 2,3 ఆర్బీకేలు ఉన్న చోట గ్రామాన్ని యూనిట్‌గా ఏర్పరచి వీఏహెచ్‌ఏలను నియమించడం జరిగింది. అదనంగా ఉన్న వీఏహెచ్‌ఏలను లేనిచోట్ల సర్దుబాటు చేశారు. ఇక మిగిలిన 1,896 ఆర్బీకేల పరిధిలో వీఏహెచ్‌ఏల నియామకానికి ప్రభుత్వం తాజాగా గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో పోస్టుల భర్తీకి పశు సంవర్ధక శాఖ నేడు నోటిఫికేషన్‌ ఇవ్వనుంది.

జిల్లాల వారిగా పోస్టులు :
విశాఖపట్నం 28, విజయనగరం 13, శ్రీకాకుళం 34, అనంతపురం 473, చిత్తూరు 100, కర్నూలు 252, వైఎస్సార్ 210, నెల్లూరు 143, ప్రకాశం 177, గుంటూరు 229, కృష్ణా 120, పశ్చిమ గోదావరి 102, తూర్పు గోదావరి 15.. ఈ నోటిఫికేషన్ తో మొత్తం ఖాళీలన్నీ పూర్తి చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు