గెలుపే లక్ష్యంగా జనసేన టిడిపి ఆత్మీయ సమావేశం
ఏలూరు జిల్లా చింతలపూడిలో జనసేన టిడిపి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తూ ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు ఇరుపార్టీ నేతలు.
ఏలూరు జిల్లా చింతలపూడిలో జనసేన టిడిపి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తూ ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు ఇరుపార్టీ నేతలు.
పాలకొల్లులో హై టెన్షన్ నెలకొంది. టిడ్కో గృహాల వేదికగా రాజకీయం వేడెక్కింది. పోటా పోటీ నిరసన కార్యక్రమం చేపట్టారు వైసీపీ టీడీపీ. దీంతో, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును అరెస్టు చేశారు.
పార్క్ చేసి ఉన్న బైకును ఢీకొట్టిన లారీ ఆ ద్విచక్ర వాహనాన్ని 20 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం గ్రామంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు లారీని ఆపి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
కార్తీక మాసం సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ పంచారామాలను దర్శించడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా శబరిమల, అరుణాచలానికి కూడా ప్రత్యేక సర్వీసులను నడపనుంది,
వాడపల్లి దివ్యక్షేత్రంలో శ్రీదేవీ భూదేవీ సమేతుడై స్వయంభువుగా వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైవభవంగా కొనసాగుతున్నాయి. కన్నుల పండువగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను వీక్షించేందుకు వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. గోవింద నామస్మరణతో ఆలయం మారుమ్రోగింది.
పశ్చిమగోదావరి జిల్లాలో వరుస దొంగతనాలు ప్రజలను భయపడేలా చేస్తున్నాయి. SBI బ్యాంక్ చోరి ఘటన మారువకముందే మరో ఘటన జరిగింది. పేరుపాలెం బీచ్ సమీపంలో పాండురంగస్వామి ఆలయంలో హుండిని ధ్వంసం చేసి నగదు అపహరించారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం SBI బ్రాంచ్ లో దుండగుడు హల్ చల్ చేశాడు. క్యాషియర్ కనకదుర్గ ను కత్తితో బెదిరించి రూ. 6.50 లక్షలు నగదు ఎత్తుకెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన బ్యాంకుకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో దారుణం చోటుచేసుకుంది. భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చాడు ఓ భర్త. పదునైన ఆయుధంతో పొడిచి పంటకాలువలో పడేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలంలో డాగ్స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు.
ఏపీ (AP) ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. పలు సంస్థల్లో ఉన్న ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఏర్పాటు చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్-ఏపీ) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి పిలుపునిచ్చింది.