Eluru Politics: ఏలూరు టిక్కెట్ ఎవరికి? నగరంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ..!
టీడీపీ నిరసన కార్యక్రమాల్లో తొలిసారి తెలుగుదేశంతో కలిసి జనసేన పార్టీ పాల్గొనడం నియోజకవర్గంలో తీవ్ర చర్చకు దారితీసింది. ఏలూరు టిక్కెట్ మాత్రం అటు టీడీపీ అభ్యర్దికి ఇస్తారా లేక జనసేన పార్టీ అభ్యర్దికి ఇస్తారా అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీడీపీ, జనసేన పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయంటూ జనసేనాని ప్రకటించిన తరువాత బడేటి చంటిలో జోష్ తగ్గింది. ప్రస్తుతం ఆయన నామమాత్రంగానే టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దింతో ఏలూరు టిక్కెట్ ఏ పార్టీ అభ్యర్దికి ఇస్తారనే ఉత్కంఠ ఏలూరు ఓటర్లలో నెలకొంది.