AP: మోసపోయిన రైతులకు న్యాయం చేయండి.. రైతు సంఘం నాయకుల డిమాండ్..!
ఏలూరు జిల్లాలో పోలవరం రైతులను మోసగించిన దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మోసపోయిన రైతులకు న్యాయం చేయాలన్నారు. రైతుల నుండి మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు చేసి దాదాపు రూ. 3.5 కోట్లు చెల్లించకుండా మోసం చేశారన్నారు.