/rtv/media/media_files/2025/02/18/hY4oNqrIhnpVWRz61lZd.jpg)
Vallabhaneni Vamshi
వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీకి బిగ్ షాక్ తగిలింది. వంశీని మూడు రోజుల కస్టడీకి ఇస్తూ విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. వెన్నునొప్పి కారణంగా ఇబ్బంది పడుతున్నానంటూ వంశీ వేసిన పిటిషన్ పై కోర్టు స్పందించింది. బెడ్ అనుమతిస్తూ జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వంశీని ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారించాలంటూ కోర్టు పోలీసులను ఆదేశించింది. ఉదయం, సాయంత్రం కచ్చితంగా మెడికల్ టెస్టులు చేయాలని సూచించింది. విజయవాడ లిమిట్స్ లోనే కస్టడీలోకి తీసుకొని విచారించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా న్యాయవాది సమక్షంలోనే విచారించాలంటూ కోర్టు ఆదేశాలు జారీచేసింది.
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి
2023 ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరం టీడీపీ ఆఫీసు (TDP Office) పై దాడి కేసులో వల్లభనేని వంశీ ఆరోపణలు ఎదురుకుంటున్నారు. ఈ కేసులో ఆయన ఏ71గా ఉన్నారు. అయితే ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న గన్నవరం టీడీపీ కార్యాలయం ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్ నాలుగు రోజుల క్రితం తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. అయితే సత్యవర్ధన్ ను బెదిరించి కొత్త అఫిడవిట్ వేయించారని వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు చేశారు పోలీసులు.
సత్యవర్ధన్ను బెదిరించినట్లుగా సెల్ఫోన్ ఆడియో రికార్డులన్నీ పోలీసులకు దొరికాయి. తనను బెదిరించి కిడ్నాప్ పాల్పడ్డట్టుగా సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వల్లభనేని వంశీ పై ఎస్సీ, ఎస్టీ, బీఎన్ ఎస్ యాక్ట్ 140 (1), 308, 351 (3), రెడ్విత్ 3(5) కింద మొత్తం ఏడు కేసులు నమోదు చేశారు. వంశీ అనుచరల బెదిరింపు వల్లే కోర్టులో తాను పిటిషన్ వెనక్కి తీసుకున్నట్లు పోలీసులకు తెలిపారు సత్యవర్ధన్. దీంతో వంశీతో పాటుగా ఆయన ఐదుగురు అనుచరులుపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. నేరం రుజువైతే వంశీకి 140(1) యాక్ట్ కింద పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.