/rtv/media/media_files/2025/03/15/tNC3IwKpah7Os0ngyR4F.jpg)
Vijayasai Reddy
Vijayasai Reddy : సీఆర్జెడ్ ఉల్లంఘనలు వ్యవహారంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబానికి మరో షాక్ తగిలింది. భీమిలి బీచ్లో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన అక్రమ కట్టడాలను జీవీఎంసీ పూర్తిగా తొలగిస్తోంది. ఇక్కడ విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డికి చెందిన భూమిలో భారీ భవన నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఇసుక తిన్నెల మీద భారీగా గుంతలు తవ్వి స్ట్రాంగ్ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు. సముద్ర తీరాన్ని ఆనుకుని చేపట్టిన భవనం అక్రమ నిర్మాణాలుగా నిర్ధారణ కావడంతో కూల్చి వేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఈఎక్స్ 200 సామర్థ్యం గల బ్రేకర్, బకెట్ యంత్రాలతో బీచ్లో నిర్మించిన అక్రమ కాంక్రీట్ నిర్మాణాలను సుమారు 10 అడుగుల భూమి లోపల వరకు తవ్వి కాంక్రీట్ నిర్మాణ గోడలను తొలగించారు.
Also Read: ఓలా, ఉబర్ డ్రైవర్ల ముసుగులో...బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాలో వెలుగులోకి సంచలన విషయాలు...
ఇదిలా ఉండగ.. భీమిలి బీచ్ వద్ద సముద్రానికి అతి సమీపంలో సీఆర్జడ్ నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కాంక్రీట్ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని జనసేన కార్పొరేటర్ పీఎల్వీఎన్ మూర్తి యాదవ్ గతంలో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. భీమునిపట్నం (భీమిలి) సీఆర్జడ్ జోన్ పరిధిలో శాశ్వత రెస్ట్రోబార్ల ఏర్పాటుతో తాబేళ్ల ఉనికికి ప్రమాదం పొంచి ఉందంటూ గ్రామాభివృద్ధి సేవా సంఘం అధ్యక్షుడు గంటా నూకరాజు మరో పిల్ వేశారు. గతంలో ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు.. సీఆర్జడ్ పరిధి నిర్ణయించి, అక్రమ నిర్మాణాలు ఉంటే కూల్చివేయాలని ఆదేశించింది. అయితే ఈ కేసు గతంలో హైకోర్టులో చర్చకు రాగా హై కోర్టు సైతం ఆ కట్టడాలను కూల్చాల్సిందేనని ఆదేశించింది.
Also Read: హోలీ రోజు ఆకతాయిలు చేసిన పనికి.. 8 మంది అమ్మాయిలు హాస్పిటల్ పాలైయ్యారు
వైసీపీకి గుడ్ బై చెప్పి రాజకీయాలు వదిలేసి హరే రామ హరే కృష్ణ అనుకుంటున్నా విజయసాయిరెడ్డి ని పాత కేసులు వదిలేలా లేవు. వైసీపీ ప్రభుత్వంలో మాట్లాడిన మాటలన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో మెడకు చుట్టుకుంటున్నాయి. రాజకీయాలకు స్వస్తి చెప్పి కామ్ అయిన విజయ్ సాయి రెడ్డి పై కేసులు వదిలిపెట్టేలా లేవు అంటున్నారు ఏపీ ప్రజలు. కాకినాడ పోర్ట్ వాటాల బదిలీ కేసులో కేవీ రావు ఫిర్యాదుతో విజయసాయి రెడ్డిపై 506, 384, 420, 109, 467, 120(బి) రెడ్ విత్ 34 సెక్షన్ల కింద సీఐడీ పోలీసులు విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. రెండు రోజుల కిందట విజయసాయిరెడ్డి నివాసానికి వెళ్లిన సీఐడీ అధికారులు ఆయన అందుబాటులో లేకపోవటంతో ఆయన భార్యకు నోటీసులు అందజేశారు.
ఇది కూడా చూడండి: దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు...
ఈ కేసులో వై.వి.సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్రెడ్డి ఏ1గా, విజయసాయిరెడ్డి ఏ2గా ఉన్నారు. మార్చి 12వ తేదీ ఉదయం11 గంటలకు విజయవాడ ఆఫీస్కు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు, విజయిసాయిరెడ్డి విచారణకు వెళ్తారా లేదా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
Also Read: హిందీ భాష రుద్దడంపై పవన్ వ్యాఖ్యలు దుమారం.. స్పందించిన డీఎంకే