Actor Jethwani Case : మరో ఇద్దరు ఐపీఎస్‌ల అరెస్ట్‌?

ముంబై నటి జత్వానీకేసు విచారణలో సీఐడీ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్‌ చేసిన ప్రభుత్వం వారిపై సీఐడీ విచారణకు ఆదేశించింది. వారిలో ఆంజనేయులును అరెస్ట్ చేయగా కాంతిరాణా తాతా, విశాల్ గున్నిలకు సీఐడీ మరోసారి నోటీసులు జారీ చేసింది.

New Update
Actor Jethwani Case

Actor Jethwani Case

Actor Jethwani Case : ముంబై నటి జత్వానీకి సంబంధించిన కేసు విచారణలో సీఐడీ అధికారులు దూకుడు పెంచుతున్నారు. ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్‌ చేసిన ప్రభుత్వం వారిపై సీఐడీ విచారణకు ఆదేశించింది. అందులో భాగంగాసీనియర్ ఐపీఎస్ అధికారి, వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన పి.ఎస్.ఆర్. ఆంజనేయులును ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జత్వానీ కేసు విచారణ సందర్భంగా నిందితులను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని ఇటీవల హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో సీతారామాంజనేయులు అరెస్టయ్యారు.ఆంజనేయులను గత ఏడాది సెప్టెంబరులో ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

Also Read: BIG BREAKING: మమ్మల్ని కాపాడండి...ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించిన పాక్
 
కాగా ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరు ఐపీఎస్‌ అధికారులు కాంతి రాణా తాతా, విశాల్ గున్నిలకు సీఐడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. మే 5వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొంది. గతంలో ఈ అధికారులిద్దరూ ఇచ్చిన వాంగ్మూలాలకు, ప్రస్తుత విచారణలో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు వెల్లడించిన అంశాలకు మధ్య వైరుధ్యాలు కనిపించడంతో తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Also Read: సింహాచలం చందనోత్సవంలో విషాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి

ఈ కేసుకు సంబంధించి సీఐడీ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులును విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా, గతంలో కాంతి రాణా తాతా, విశాల్ గున్నిలు వెల్లడించిన కొన్ని అంశాలను ఆయన ఖండించినట్లు సమాచారం. ముఖ్యంగా, జత్వానీని ముంబై నుంచి తీసుకురావాలనే టాస్క్‌ను తనకు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ హోదాలో ఆంజనేయులు అప్పగించారని గతంలో విశాల్ గున్ని సీఐడీకి తెలిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాను విశాల్ గున్నితో కేవలం నిఘా సంబంధిత విషయాలు మాత్రమే మాట్లాడి ఉంటానని... జత్వానీ విషయంపై విశాల్ గున్నితో కానీ, కాంతి రాణాతో కానీ తాను ఎలాంటి చర్చలు జరపలేదని పీఎస్ఆర్ ఆంజనేయులు తన విచారణలో స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో వారిని మరోసారి విచారించనున్నారు.ఈ విచారణ అనంతరం కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 

Also Read: అత్యాచారం చేసిన యువతినే పెళ్లిచేసుకున్న ఖైదీ.. జైల్లో ఉండగానే ట్విస్ట్ అదిరింది!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు