శ్రీవారి భక్తులకు అలర్ట్.. టీటీడీ చైర్మన్ కీలక ప్రకటన!

ఈ నెల 7న వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయనున్నట్లు టీడీపీ చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన చేశారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 6వ తేదీన ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవన్నారు.

New Update
TTD Chairman BR Naidu

TTD Chairman BR Naidu

జనవరి 7న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనలు రద్దు చేయనున్నట్లు చెప్పారు. జనవరి 10న వైకుంఠ ఏకాదశిని పుర‌స్కరించుకుని ఆలయాన్ని అర్చకులు సిబ్బంది శుద్ధి చేయనున్నట్లు చెప్పారు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా 6వ తేదీన ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని బీఆర్ నాయుడు వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు