డిప్యూటీ సీఎం పవన్ తిరుమల పర్యటన ఖరారు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతి పర్యటన ఖరారు అయ్యింది. తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలతో చేపట్టిన ప్రాయశ్చిత దీక్షను విరమించడానికి అక్టోబర్ 2వ తేదీన మెట్లమార్గంలో తిరుమలకు చేరుకోనున్నారు. మరుసటి రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకుని దీక్ష విరమించనున్నారు.