Big Breaking: ఏపీలో టీడీపీ నేత దారుణ హత్య

తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం నాంచారంపేటలో రాజకీయ హత్య జరిగింది. పాత కక్షలతో చెలగల కాటయ్య అనే టీడీపీ నేతను గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్‌ పోసి నిప్పంటించి చంపేశారు.

New Update
Wife Murder: అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

Tiruapti: తిరుపతి జిల్లాలో టీడీపీ నేత హత్య కలకలంరేపింది. చిల్లకూరు మండలం నాంచారంపేటలో రాజకీయ కక్షలతో చెలగల కాటయ్య అనే టీడీపీ నేత ఇంటిపై దాడి చేశారు. నిద్రిస్తున్న మరో టీడీపీ నేతపై పెట్రోల్‌ పోసి నిప్పంటించడంతో అక్కడికక్కడే చనిపోయాడు.

Also Read: రాష్ట్రవ్యాప్తంగా 162 మంది ఏఈవోల సస్పెన్షన్‌!

హత్య గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సోమవారం రాత్రి హరిప్రసాద్ తన బంధువు చెలగల కాటయ్యతో కలిసి బయటకు వెళ్లారు. అనంతరం అర్ధరాత్రి దాటిన తర్వాత తిరిగి వచ్చి కాటయ్య ఇంట్లో హరిప్రసాద్ నిద్రిస్తుండగా.. మంగళవారం వేకువజామున కొందరు దుండగులు అక్కడికి వెళ్లి పెట్రోల్‌ పోసి నిప్పంటించారు.

Also Read: ఏపీవ్యాప్తంగా భారీ వర్షాలు.. కొనసాగుతోన్న వాయుగుండం

మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా..

వెంటనే గమనించిన కొందరు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. హరిప్రసాద్ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.వైఎస్సార్‌సీపీకి ‌చెందిన కట్టా రామచంద్రారెడ్డి, దుంపల మధు, అతడి అనుచరులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చనిపోయిన హరిప్రసాద్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: బిగ్ బాస్ షోలో గంగవ్వకు గుండెపోటుపై కీలక ప్రకటన

ఈ ఘటన జరిగిన సమయంలో మరికొందరిపైనా దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఊరిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: నిర్మాణంలో ఉండగా కూలిన భవనం.. శిథిలాల కింద 17 మంది

అన్నమయ్య జిల్లాలో విషాదం.. బస్సు ఢీకొని ఐదుగురు మృతి ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బంధువు అంత్యక్రియలకు వెళ్లి ఆటోలో తిరిగి వస్తున్నవారిని ప్రైవేట్‌ బస్సు ఢీకొట్టడంతో ఐదుగురు మృత్యువాతపడ్డారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. బస్సు చిత్తూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బంధువు అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన జరిగిందని చెబుతున్నారు. చిత్తూరు-కడప రహదారిపై కలకడ సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. సంబేపల్లె మండలం రౌతుకుంటలో ఓ మహిళ మృతిచెందింది. 

ఇందిరమ్మ కాలనీ సమీపంలో..

అంత్యక్రియల్లో పాల్గొనడానికి కలికిరి మండలం చండ్రావారిపల్లె పంచాయతీ దూదేకులపల్లెకి చెందిన బంధువులు ఆటోలో వెళ్లారు. తిరిగి గ్రామానికి వస్తుండగా ఇందిరమ్మ కాలనీ సమీపంలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఫకీర్‌బీ (55), బుజ్జమ్మ (50), ఖాదర్‌వలీ (35), చిత్తూరు జిల్లా సోమల మండలం నెల్లిమందకు చెందిన ఆటో డ్రైవర్‌ నూరుల్లా మృతి చెందారు.

మరో వ్యక్తితో పాటు తల్లి, కుమార్తెలు తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతున్నారు. సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గత రెండు రోజుల కిత్రం ఎన్టీఆర్ జిల్లా గరికపాడు రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి చెందిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ జిల్లా గరికపాడు సమీపంలో NH-65పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌కి చెందిన వారు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకుని వస్తుండగా యాక్సిడెంట్ చోటుచేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కి తిరిగి వస్తుండగా.. రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ  ఘటనలో తల్లి కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం మరువక ముందే..  అన్నమయ్య జిల్లాలో ప్రమాదం ఏపీ ప్రజల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.

ఇదిలా ఉండగా.. రాజస్థాన్​లోని ధోల్​పుర్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది చిన్నారులతో సహా 11 మంది మృతి చెందారు. శనివారం అర్ధరాత్రి జాతీయ రహదారిపై టెంపోను ఓ స్లీపర్ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు