/rtv/media/media_files/2025/09/02/sugali-preeti-case-2025-09-02-21-15-22.jpg)
Sugali Preeti Case
సుగాలి ప్రీతి కేసు ఏపీలో మరోసారి దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2017లో ప్రతీ మృతి కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఏడాది ఆగస్టు 18న కర్నూల్లో ఆమె మృతి చెందింది. స్కూల్ హాస్టల్లో ఫ్యాన్కు వేలాడుతూ ఆమె మృతదేహం కనిపించడం కలకలం రేపింది. వైసీపీ హయాంలో కూడా ఈ కేసును సీబీఐకి అప్పగించారు. కానీ దర్యాప్తు ముందుకు సాగలేదు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామని గతంలో అప్పటి విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Also Read: అయ్యో.. ఓనమ్ వేడుకల్లో విషాదం.. డాన్స్ చేస్తూ కుప్పకూలిన ఉద్యోగి!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఏడాది దాటింది. అయినప్పటికీ తమ కూతురు కేసు గురించి పట్టించుకోవడం ప్రీతి తల్లి వాపోయింది. దీంతో వీల్ చైర్ యాత్రకు ఆమె సిద్ధమైపోయింది. ఈ క్రమంలోనే ఈ కేసును కూటమి ప్రభుత్వం కూడా సీబీఐకి అప్పగించింది.
Reminding Sugaali Preeti’s mother’s words as we live with short memory. Kalyan garu has made this case known nationwide but agencies have its own reservations to take up further with no basic clues. Agencies have enough non-directional cases on their plate pic.twitter.com/BoXFyQ7zl0
— Srivadana🚩 (@Sri_Madd) August 28, 2025