AP: 20 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్..!
నెల్లూరు జిల్లా చెన్నూరులో గిరిజన గురుకుల పాఠశాలను ఇంచార్జ్ కలెక్టర్ ధ్యాన్ చంద్ ఆకస్మిక తనిఖీ చేశారు. కలుషిత నీరు త్రాగి అస్వస్థతకు గురైన 20 మంది విద్యార్థులను పరిశీలించారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు త్రాగునీటిని బయట నుండి తెప్పించాలని అధికారులకు సూచించారు.