భోలేబాబా డెయిరీ నుంచే తిరుమలకు నెయ్యి .. వెలుగులోకి సంచలన నిజాలు

టీటీడీలో నెయ్యి కల్తీ అయ్యిందనే ఆరోపణలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి వాణిజ్య పన్నుల శాఖ పలు కీలక విషయాలు వెల్లడించింది. ఈ నెయ్యి మూలాలు ఉత్తరాఖండ్‌లోని భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద ఉన్నట్లు తేలింది.

laduu ttd
New Update

తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అయ్యిందనే ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే.  ఏఆర్‌ డెయిరీ ఈ నెయ్యి సరఫరా చేసిందని తేలడంతో ఆ కంపెనీపై కేసు కూడా పెట్టారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి వాణిజ్య పన్నుల శాఖ పలు కీలక విషయాలు వెల్లడించింది. ఏఆర్‌ డెయిరీకి నెయ్యి సరఫరా చేసిన వైష్ణవి డెయిరీ ఎక్కడి నుంచి నెయ్యి తీసుకొచ్చింది అన్న విషయాలు వివరించింది. అయితే ఈ నెయ్యి మూలాలు ఉత్తరాఖండ్‌లోని భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద ఉన్నట్లు బయటపడింది. నెయ్యి సరఫరా ఇన్‌వాయిస్‌లు, ఈ-వే బిల్లులు, ట్యాంకర్లు ఏయే టోల్‌ప్లాజాను ఎప్పుడూ, ఎలా దాటాయి అన్న వివరాలన్నీ కూడా ఆధారణలతో సహా ఓ సీక్రెట్ రిపోర్టును వాణిజ్యశాఖ టీటీడీకి సమర్పించింది. 

Also Read: రాహుల్‌ గాంధీకి బిగ్ షాక్.. ఆ కేసులో పుణె కోర్టు సమన్లు!

ఈ నివేదిక ప్రకారం.. తిరుపతికి సమీపంలో ఉన్న వైష్ణవి డెయిరీ అనే కంపెనీ జూన్, జులై నెలల్లో ఉత్తరాఖండ్‌లోని భోలోబాబా ఆర్గానిక్ డెయిరీ నుంచి లక్షల కేజీల నెయ్యి కోనుగోలు చేసింది. ఈ డెయిరీ నుంచే నెయ్యిని ఏఆర్‌ డెయిరీ కొనుగోలు చేసింది. మొత్తం 5 ట్యాంకర్లలో 8 ట్రిప్పులుగా నెయ్యి టీటీడీకి సరఫరా అయ్యింది. అందులో మూడు ట్రిప్పుల నెయ్యి ఏఆర్‌ డెయిరీకి వెళ్లకుండానే నేరుగా అక్కడికి సరఫరా చేశారు. మరో నాలుగు ట్యాంకర్లు దిండిగల్‌లోని ఏఆర్ డెయిరీకి వెళ్లాయి. మళ్లీ ఆ చోటు నుంచి టీటీడీ వచ్చి నెయ్యి సరఫరా చేశారు. ఏ ట్యాంకరు దిండిగల్‌కు వెళ్లింది. ఎన్ని టోల్‌ప్లాజాలు దాటింది, ఏ ట్యాంకరు దిండిగల్ వెళ్లలేదు అన్న విషయాలు ఈ రిపోర్టులో వివరించారు. మొత్తానికి ఏఆర్ డెయిరీ ఈ వ్యవహారంలో మోసానికి పాల్పడ్డట్లు తేలింది. 

#andhra-pradesh #telugu-news #national-news #ttd
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe