VIRAL VIDEO: వీడు మగాడ్రా బుజ్జి.. కరెంట్ తీగలపై పడుకున్నావేంట్రా!

ఏపీలోని మన్యం జిల్లాలో ఓ తాగుబోతు మద్యం మత్తులో కరెంట్ తీగలపై పడుకున్నాడు. కరెంటు స్తంభంపైకి ఎక్కుతుండటంతో చూసిన పలువురు ట్రాన్స్‌ఫార్మర్ ఆపేశారు. అతను ఆగకుండా పైకి వెళ్లి విద్యుత్ తీగలపై పడుకున్నాడు. అందరూ కలిసి బలవంతంగా అతడిని కిందికి తీసుకొచ్చారు.

New Update
Drunken Man Sleeping on Wires

Drunken Man Sleeping on Wires

వీడు మగాడ్రా బుజ్జి అనే వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఎవరికైనా నిద్రస్తో ఏం చేస్తారు.. ఇంట్లో మంచంపై పడుకుంటారు లేదా నేలపై పడుకుంటారు. కానీ మనోడు మాత్రం ఏకంగా కరెంట్ తీగలపైనే పడకేసిండు. ఈ చిత్రం చూసినోళ్లంతా ముక్కున వేళుసుకుంటున్నారు.

విద్యుత్ తీగలపై నిద్ర

వీడెవడండీ బాబు ఇంతకు తెగించాడు అంటూ మాట్లాడుకుంటున్నారు. స్తంభం ఎక్కి పైన ఉన్న వైర్లపై ఎంచక్కా నిద్రిస్తు్న్న వీడియో తెగ వైరల్ కాగా.. చూసినోళ్లంతా ఓ వైపు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. మరికొందరు మాత్రం అక్కడకు వెళ్లి ఎలా పడుకున్నావ్‌ బ్రో అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

అసలు స్తంభం ఎక్కి పడుకోవలసిన అవసరం ఏముచ్చిందంటూ ఇంకొందరు మాట్లాడుకుంటున్నారు. అయితే దానికి ఓ గమ్మత్తయిన కారణం ఉందండోయ్. 2024 ఏడాదికి చాలా మంది వీడ్కోలు పలికారు. డిసెంబర్ 31న చుక్కా, ముక్కతో ఎంజాయ్ చేశారు. మరి మనోడేమైనా తక్కువా.. బాగా మందుకొట్టాడు. ఆ మద్యం మత్తులో ఏకంగా కరెంట్ తీగలపై పడుకున్నాడు. 

ఇదంతా ఏపీలోని మన్యం జిల్లాలో జరిగింది. జిల్లాలోని పాలకొండ మండలం ఎం.సింగిపురంలో ఓ వ్యక్తి తాగి గ్రామస్థులను హడలెత్తించాడు. మద్యం మత్తులో కరెంటు స్తంభంపైకి ఎక్కాడు. అది గమనించిన కొందరు వెంటనే ట్రాన్స్ ఫార్మర్ ఆపేశారు. ఆ వ్యక్తి ఆగకుండా పైకి వెళ్లి ఏకంగా విద్యుత్ తీగలపైనే పడుకున్నాడు. కాసేపు అక్కడే విన్యాసాలు చేశాడు. అందరూ కలిసి బలవంతంగా అతడిని కిందికి తీసుకొచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు