BIG BREAKING: డిప్యూటీ సీఎం పవన్‌కు ప్రాణహాని.. జనసేన ఆఫీస్​పై ఎగిరిన డ్రోన్లు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మంగళగిరి క్యాంపు ఆఫీసుపై డ్రోన్‌ కలకలం రేపింది. మధ్యాహ్నం 1:30 PM గంటల నుంచి 1:50 గంటల వరకు డ్రోన్‌ ఎగిరిందని పార్టీ నేతలు చెబుతున్నారు. పవన్‌పై దాడికి కుట్ర జరుగుతుందంటూ జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

New Update
Pawan Kalyan

Pawan Kalyan

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మంగళగిరి క్యాంపు ఆఫీసుపై డ్రోన్‌ కలకలం రేపింది. 20 నిమిషాల పాటు ఆఫీసుపై డ్రోన్ చక్కర్లు కొట్టింది. మధ్యాహ్నం 1:30 PM గంటల నుంచి 1:50 గంటల వరకు డ్రోన్‌ ఎగిరిందని పార్టీ నేతలు చెబుతున్నారు. పవన్‌పై దాడికి కుట్ర జరుగుతుందంటూ జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే డీజీపీ, గుంటూరు జిల్లా ఎస్పీ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.  

గతంలో పవన్‌ కల్యాణ్ పాల్గొన్న కార్యక్రమంలో కూడా ఫేక్‌ ఐపీఎస్‌ బయటపడటం సంచలనం రేపింది. మరోసారి ఆగంతకుడి నుంచి పవన్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇలాంటి వరుస ఘటనల నేపథ్యంలో పవన్‌ భద్రతపై జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు