Pawan Kalyan: అక్టోబర్ 3న తిరుపతిలో పవన్ బహిరంగ సభ

AP: పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షను అక్టోబర్ 2న విరమించనున్నారు. 11 రోజుల దీక్షను తిరుమల ఏడుకొండల స్వామిని దర్శించుకొని విరమిస్తారు. అనంతరం 3వ తేదీన తిరుపతిలో వారాహి సభను నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు.

TTD Pawan Kalyan
New Update

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన  ప్రాయశ్చిత్త దీక్షను అక్టోబర్ 2న విరమించనున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 1వ తేదీన తిరుపతికి చేరుకొని అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుచుకొంటూ తిరుమలకు చేరుకుంటారు. 2వ తేదీ ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నారు. అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమిస్తారు. 

3న బహిరంగ సభ...

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించి అపవిత్రం చేసిన విషయం వెలుగులోకి వచ్చిన దరిమిలా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. సోమవారానికి దీక్ష రెండో రోజుకు చేరుకుంది. 11 రోజుల దీక్షను తిరుమల ఏడుకొండల స్వామిని దర్శించుకొని విరమిస్తారు. 2వ తేదీన తిరుమల కొండపై ఉంటారు. అనంతరం 3వ తేదీన తిరుపతిలో వారాహి సభను నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు.

#pawan-kalyan #ap-news #Tirupati Laddu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి