Ap Govt:వారిపై చంద్రబాబు సర్కార్ సీరియస్.. రంగంలోకి ఇంటెలిజన్స్!

మద్యం షాపుల లైసెన్సులు దక్కించుకున్న వారిని.. కొందరు నేతలు వాటాల కోసం బెదిరిస్తున్నారన్న అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంది.సీఎం చంద్రబాబు సమాచారం మద్యం షాపుల్లో వాటాల కోసం లైసెన్సుదారులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని ఆ నేతల్ని హెచ్చరించారు

Press Meet : గెలుపు తరువాత చంద్రబాబు సంచలన ప్రెస్ మీట్
New Update

Ap Govt: ఏపీలో మద్యం షాపులకు లాటరీ ప్రక్రియ పూర్తయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా ఏ షాపు ఎవరికి దక్కిందో వివరాలు కూడా వచ్చేశాయి. అయితే లాటరీలో షాపులు దక్కించుకున్నవారికి.. కొన్ని నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలు, మద్యం సిండికేట్ల నుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. తమ నియోజకవర్గాల్లో మద్యం వ్యాపారం చేయాలంటే తమకు 10 నుంచి 20 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

Also Read:  విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. మరో రెండు రోజులు సెలవులు!

 ఈ డీల్‌కు ఒప్పుకోకపోతే వ్యాపారం ఎలా చేస్తారో చూస్తామని వార్నింగ్ లు కూడా ఇచ్చారట. మరికొందరు రాజకీయ నేతల అనుచరులు.. ఎంతో కొంత గుడ్‌విల్‌ ఇచ్చేస్తాం.. మద్యం షాపుల లైసెన్సులు తమకు అప్పగించాలని బెదిరింపులకు దిగుతున్నారంట. కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, పల్నాడు, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు జిల్లాల్లో ఈ పరిస్థితి ఉంది.

Also Read: తిరుమలకు వెళ్లే భక్తులకు అలెర్ట్.. వర్షాల నేపథ్యంలో దర్శనాలు రద్దు

మరికొన్ని చోట్ల ప్రతి షాపు నుంచి నెల నెలా తాము చెప్పినంత మొత్తంతో పాటు, కొంత వాటా కూడా ఇవ్వాలని షాపులు దక్కించుకున్నవారికి ఒత్తిళ్లు స్టార్ట్‌ అయ్యాయని సమాచారం. ఈ డీల్‌కు ఒకే చెబితేనే షాపులు రన్‌ అవుతాయని.. లేకపోతే వ్యాపారం కూడా చేయలేరని వార్నింగ్ ఇచ్చారట. మద్యం సిండికేట్లతో సంబంధం లేకుండా కొందరు సొంతగా దరఖాస్తులు చేసుకోగా.. లాటరీలో లైసెన్సులు దక్కించుకున్నారు. 

లైసెన్సులు వదిలేయాని...

వారిపై సిండికెట్లు ఒత్తిడి తెస్తున్నాయి.. గుడ్‌విల్ ఇచ్చేస్తాం.. లైసెన్సులు వదిలేయాని బేరాలు చేస్తున్నారట. కొంతమంది ఒక్కో షాపునకు రూ.కోటి, రూ.85 లక్షల చొప్పున చెల్లించేందుకు ఆఫర్లు ఇచ్చినట్లు సమాచారం. కొన్నిచోట్ల పెట్టుబడి లేకుండా 10 శాతం వాటా ఇస్తామని ఆఫర్ ఇచ్చారట.ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియడంతో సీరియస్‌గా స్పందించారు. మద్యం షాపుల లైసెన్సులు దక్కించుకున్న వారిని.. కొందరు నేతలు వాటాల కోసం బెదిరిస్తున్నారన్న అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంది.

Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. డార్లింగ్ మొదటి సినిమా రీరిలీజ్

రాష్ట్రవ్యాప్తంగా ఏ, ఏ జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారనే దానిపై.. ఎక్సైజ్‌ శాఖ, నిఘా విభాగం, పార్టీ వర్గాల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు సమాచారం తెప్పించుకున్నట్లు సమాచారం. మద్యం షాపుల్లో వాటాల కోసం లైసెన్సుదారులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని ఆ నేతల్ని హెచ్చరించినట్లు తెలుస్తుంది. మద్యం, ఇసుక విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలని.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 

నేతలెవరూ జోక్యం చేసుకోవద్దు!

అలాంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు చంద్రబాబు. మద్యం షాపులకు లైసెన్సులు దక్కించుకున్న వ్యాపారులు స్వేచ్ఛగా, నిబంధనల ప్రకారం వ్యాపారం చేసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మద్యం షాపుల విషయంలో నేతలెవరూ జోక్యం చేసుకోవద్దని.. లైసెన్సులు దక్కినవారు వ్యాపారం చేసుకునేందుకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని తేల్చి చెప్పారు. ఈ విషయంలో సీరియస్‌గా ఉంటామని అన్నారు.

Also Read: మహా ఎన్నికలకు మోగనున్న నగారా!

 

 

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe