Ap News: ప్రజాభిప్రాయం తప్పనిసరి అంటున్న ఏపీ సీఎం!

ప్రభుత్వ పథకాలు,కార్యక్రమాలు, పౌరసేవల పై ప్రజల నుంచి నిరంతర ఫీడ్‌ బ్యాక్ తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. మెరుగైన సేవల కోసం నేరుగా లబ్ధిదారుల నుంచి అభిప్రాయ సేకరణ జరపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

New Update
CBNN

Chandrababu:ప్రభుత్వ పథకాలు,కార్యక్రమాలు, పౌరసేవల పై ప్రజల నుంచి నిరంతర ఫీడ్‌ బ్యాక్ తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇందులో భాగంగా మెరుగైన సేవల కోసం నేరుగా లబ్ధిదారుల నుంచి అభిప్రాయ సేకరణ జరపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఐవీఆర్ఎస్ విధానాన్ని విస్తృతంగా ఉపయోగించాలని చెప్పారు. ఏ అంశం పైనైనా ప్రజలు చెప్పిందే ఫైనల్ అని స్పష్టం చేశారు. 

Also Read: AP: రైలు ప్రయాణికులకు గమనిక.. ఈ రైళ్లు రూట్ మార్చుకున్నాయి!

నాణ్యమైన సేవల కోసం కఖచ్చితమైన అభిప్రాయం చెప్పాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, చేపట్టే కార్యక్రమాలు, తీసుకునే నిర్ణయాలపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం ముందుకు వెళ్లాలని ప్రభుత్వం అనుకుంటుంది. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు వారి అభిప్రాయాల మేరకు నడుచుకోనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. 

Also Read: AP: ఒక్క మెసేజ్‌ చేయాలనిపించలేదా..తమ్ముడు అంటూ లోకేష్‌ ఎమోషనల్ ట్వీట్‌

ఇందుకనుగుణంగా ఇకపై ప్రభుత్వం అమలు చేసే పథకాలపై ఐవీఆర్ఎస్ ఫోన్లు చేయడం ద్వారా ఆయా కార్యక్రమాల అమలు తీరును తెలుసుకోనున్నారు.ఈ క్రమంలో లబ్ధిదారులకే నేరుగా కంప్యూటర్ బేస్డ్ ఫోన్ ​కాల్స్ ద్వారా ఆ పథకం వల్ల ప్రయోజనం, దాని అమలు, సేవల్లో నాణ్యత వంటి అంశాలపై ఫీడ్ బ్యాక్​ను ప్రభుత్వం సేకరించనుంది. వాటిపై ప్రజలు ఇచ్చే రేటింగ్ ఆధారంగా సర్కార్ మార్పులు చేర్పులు చేసుకొని పని చేయబోతుంది.

Also Read: UP:కాశీ ఆలయంలో కేక్ కట్‌ చేసిన మోడల్‌..ఆగ్రహం వ్యక్తం చేస్తున్నభక్తులు

ఇంటింటికీ పింఛన్లు, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి పథకాలకు సంబంధించి ఈ అభిప్రాయాల్ని తీసుకోబోతున్నారు. పింఛను సక్రమంగా ఇంటి వద్దనే అందుతుందా? లేదా? దీపం పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? వంటి ప్రశ్నల ద్వారా లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు.

Also Read: Ap News: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు..ఇక నుంచి ఆ విషయంలో జాగ్రత్త!

పథకాలతో పాటు ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పాలసీల అమలుపైనా ప్రజాభిప్రాయాన్ని ఐవీఆర్ఎస్ ద్వారా సర్కార్ తెలుసుకోనుంది. ఉచిత ఇసుక విధానం అమలు, నూతన మద్యం పాలసీ, అమ్మకాలపైనా ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నారు.

Advertisment
తాజా కథనాలు