ఏపీలోని నిరుద్యోగులకు రాష్ట్ర దేవాదాయశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 70 ఇంజినీరింగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 2025 జనవరి 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఖాళీల సంఖ్య : 70
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 35 పోస్టులు
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 5 పోస్టులు
టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) : 30 పోస్టులు ఉన్నాయి.
విద్యార్హత: టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉండాలి. ఏఈఈ పోస్టులకు బీఈ, బీటెక్ (సివిల్/ ఎలక్ట్రికల్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి : 42 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ : ఎగ్జామ్, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
చివరి తేదీ: జనవరి 5, 2025
వేతనం: ఏఈఈ పోస్టులకు నెలకు రూ.35,000 చెల్లిస్తారు. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు నెలకు రూ.25,000 చెల్లిస్తారు. దీంతో పాటు అదనపు అలవెన్సులు చెల్లించనున్నారు.