Ap Rains : ఏపీలో అలర్ట్.. ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు!

ఏపీలోని చిత్తూరు, తిరుపతి జిల్లాలపై ఎక్కువగా ఉంటుంది.. ఈ మేరకు ఈ రెండు జిల్లాల కలెక్టర్లు అలెర్ట్‌ అయ్యారు. తిరుపతి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో భారీ వర్షాల కారణంగా అన్ని స్కూళ్లకు సెలవులిచ్చారు.

tg rains
New Update

ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల సోమవారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయని అమరావతి వాతావరణ  కేంద్ర అధికారులు తెలిపారు. రెండు రోజుల్లో తీవ్ర అల్పపీడనం బలపడి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా వైపు పయనిస్తుందని తెలిపారు. ఇది తుపానుగా బలపడే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.

Also Read:  తెలంగాణ విద్యార్థి హత్య కేసు.. నిందితునికి 60 ఏళ్ల శిక్ష

AP Rains

నాలుగు రోజుల పాటూ ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు కురిసే అవకాశాలున్నాయి. ఈ ప్రభావం చిత్తూరు, తిరుపతి జిల్లాలపై ఎక్కువగా . ఈ మేరకు ఈ రెండు జిల్లాల కలెక్టర్లు అలెర్ట్‌ అయ్యారు. తిరుపతి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో భారీ వర్షాల కారణంగా అన్ని స్కూళ్లకు సెలవులిచ్చారు.  అలాగే చిత్తూరు జిల్లాలో కూడా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా స్కూళ్లకు సెలవులు ఇచ్చేశారు.

Also Read: గాజాలోని పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 20 మంది మృతి..

అల్పపీడనం ప్రభావం వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణింకి కూర్మనాథ్‌ అన్నారు. బుధవారం రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Also Read:  ట్రంప్‌ ర్యాలీకి సమీపంలో తుపాకీతో వ్యక్తి హల్‌చల్‌

అలాగే ముందస్తు జాగ్రత్తగా లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి.. పునరావాస కేంద్రాలను వెంటనే సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలిచ్చారు. అలాగే జిల్లాలో సెలవుల్లో ఉన్న సిబ్బంది , అధికారులు వెంటనే విధుల్లో చేరాలని చెప్పారు. అలాగే నాలుగు రోజులపాటు జలపాతాలు వద్దకు, బీచ్‌లకు పర్యాటకులకు అనుమతి ఉండదు. భారీ వర్షాల కారణంగా సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజా సమస్యల పరిష్కారవేదికను కూడా రద్దు చేశారు.

Also Read: Hyderabad - Vijayawada Highway పై కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలు

అలాగే పర్యాటక కేంద్రమైన తలకోనకు ఎవరూ రావొద్దని పోలీసులు కోరారు. నాలుగు రోజులపాటు పర్యాటకులకు అనుమతి నిలిపివేసినట్లు తెలిపారు. తలకోన జలపాతంతో పాటు మాకలరేవు, ధనువు తీసిన బండ ప్రాంతాలకు పర్యాటకులకు అనుమతి లేదు. ఇటు తిరుపతి జిల్లాలో కూడా అధికారులు అప్రమత్తం అయ్యారు.. పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

వేటకు వెళ్లొద్దు...


సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పిడుగులు పడే అవకాశాలుండడంతో పొలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయ కూలీలు , పశువుల కాపరులు చెట్ల కింద కానీ, స్తంభాల వద్ద కానీ,ఖాళీ ప్రదేశాల్లో కానీ ఉండరాదని సూచించారు.

నైరుతి తిరోగమనం...

మహరాష్ట్ర,గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గడ్‌, ఒడిశా,అస్సాం, మేఘాలయ, అరుణాచల్‌ , మణిపూర్‌, మిజోరం, త్రిపుర, నాగాలాండ్‌ తో పాటు ఉత్తర బంగాళాఖాతం నుంచి నైరుతి రుతుపవనాలు వైదొలుగుతున్నాయి. రాబోయే రెండు రోజుల్లో ఏపీతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించేందుకు అనుకూలంగా ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

#heavy-rains #ap-rains #ap-government
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe