/rtv/media/media_files/2025/05/06/J0GMecONlFjAUC3z4tLa.jpg)
tdp-mla-ex
ఏపీ టీడీపీలో విషాదం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1946 జూలై 3వ తేదీన జన్మించిన పాలకొండ్రాయుడు జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1978లో కడప జిల్లాలో రాయచోటి శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో రెండవ సారి రాయచోటి శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.
మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత సుగవాసి పాలకొండ్రాయుడు గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. పాలకొండ్రాయుడు కుటుంబం నాలుగు దశాబ్దాలుగా పార్టీకి విశేష సేవలందిస్తున్నారు. రాజంపేట ఎంపీగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పాలకొండ్రాయుడు ప్రజల అభ్యున్నతికి విశేష కృషిచేశారు. రాజకీయాల్లో… pic.twitter.com/GvlTxzPPbn
— Lokesh Nara (@naralokesh) May 6, 2025
*మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ గౌరవనీయులు శ్రీ సుగవాసి పాలకొండ్రాయుడు గారు మృతి చెందడం బాధాకరం.*
— Itdp_Rayachoti (@IRayachoti) May 6, 2025
*ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.*
*జి.నాగేంద్ర నాయుడు.*
*రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి. ఐటీడీపీ.* pic.twitter.com/1g9atIudEw
Also read : Miss World Competition : మిస్ వరల్డ్ పోటీలు..మన దేశం నుంచి పాల్గొనే అందాల భామ ఎవరంటే?
లోక్సభ సభ్యుడిగా విజయం
అనంతరం టీడీపీలో చేరి1984 లో ఆంధ్రప్రదేశ్ లోని రాజంపేట లోక్సభ నియోజకవర్గం నుండి లోక్సభ సభ్యుడిగా విజయం సాధించారు. అనంతరం1999, 2004 లలో రాయచోటి శాసనసభ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. పాలకొండ్రాయుడుకు ఓ భార్య ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పాలకొండ్రాయుడు తనయుడు ప్రసాద్బాబు ప్రస్తుతం టీడీపీలో యాక్టివ్ గా ఉన్నారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన పాలకొండ్రాయుడుకు రాయచోటి నియోజకవర్గంలో 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. ఆయన మృతి పట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలుపుతున్నారు.
Also read : సుజనా చౌదరికి తీవ్ర గాయం..హైదరాబాద్కు తరలింపు!
telugu-news | tdp | AP TDP | Sugavasi Palakondrayudu