BIG BREAKING: పవన్ కల్యాణ్ కు అనారోగ్యం.. తిరుపతి టూర్ రద్దు!

ఇటీవల అనారోగ్యానికి గురైన పవన్ కల్యాణ్ ఇంకా కోలుకోలేదు. దీంతో విశ్రాంతి కోసం మంగళగిరిలోని తన నివాసం నుంచి హైదరాబాద్ వెళ్లారు. ఈ నేపథ్యంలో రేపటి తిరుపతి టూర్ ను ఆయన రద్దు చేసుకున్నారు. పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాత పవన్ తిరుపతి వెళ్లే అవకాశం ఉంది.

New Update
Pawan Kalyan Son Accident

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతి పర్యటన రద్దు అయ్యింది. గత కొద్ది రోజులుగా పవన్ తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కేబినెట్ మీటింగ్ మధ్యలోనే బయటకు వచ్చేశారు. ఇప్పటికీ ఆరోగ్య పరిస్థితి మెరుగు పడకపోవడంతో ఈ రోజు ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు బయలుదేరినట్లు తెలుస్తోంది. ఆరోగ్య పరిస్థితి మెరుగు పడిన తర్వాత పవన్ తిరుపతికి వెళ్లే అవకాశం ఉందని జనసేన వర్గాలు వెల్లడించాయి.

ఇటీవల సింగపూర్ కు వెళ్లి వచ్చిన పవన్..

పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుకుంటున్న సింగపూర్ లోని స్కూల్లో ఇటీవల అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో అతని కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. ఇంకా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. దీంతో పవన్ సింగపూర్ వెళ్లి కుమారుడిని హైదరాబాద్ తీసుకువచ్చారు. అంతకు ముందు విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో పవన్ పర్యటించారు. వరుస ప్రయాణాల నేపథ్యంలో పవన్ అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. 

అభిమానుల్లో ఆందోళన..

పవన్ తరచుగా అనారోగ్యానికి గురవుతుండడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పిఠాపురంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ తన ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను గ్రానైట్ రాళ్లు గుండెల మీద పెట్టుకుని పగల గొట్టించుకునేవాడినన్నారు. ఇద్దరు ముగ్గురు పిల్లలను భుజాల మీద ఎత్తుకుని నడిచే అంత బలం ఉండేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు తన ఆరేళ్ల కొడుకుని ఎత్తుకోలేనంత బలహీనం అయిపోయానని షాకింగ్ కామెంట్స్ చేశారు. కానీ అభిమానుల ఆశీర్వాదంతో ఆ బలాన్ని మళ్లీ తెచ్చుకుంటానన్నారు.

 ( telugu-news | telugu breaking news )

Advertisment
Advertisment
తాజా కథనాలు