Big breaking : బాపట్లజిల్లా  మార్టూరు NH 16 పై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు

ఏపీ లోని బాపట్ల జిల్లా పర్చూరు సమీపంలోని మార్టూరు NH 16 రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి నుండి పిఠాపురానికి వెళ్తున్న కారు ఫెన్సింగ్ దిమ్మెను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

New Update
Road accident.. Three dead, two seriously injured

Road accident.. Three dead, two seriously injured

Big breaking : ఏపీ లోని బాపట్ల జిల్లా పర్చూరు సమీపంలోని మార్టూరు NH 16 రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి నుండి పిఠాపురానికి వెళ్తున్న కారు ఫెన్సింగ్ దిమ్మెను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి అతి వేగం.. కుక్క అడ్డురావడం కారణంగా తెలుస్తుంది. ఈ రోజు- తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ..విషయం తెలిసిన వెంటనే  హైవే పెట్రోలింగ్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు.  AP 03BL 1116 హుండాయ్ గ్రాండ్  i 10 వాహనంలో మొత్తం 5 గురు వ్యక్తుల ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఇద్దరు మగవారు.. ఒక మహిళ ఉన్నారు. గాయపడిన ఇద్దరిని ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.

ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. మృతులను లక్ష్మణ్‌ (70), సుబ్బాయమ్మ (65), హేమంత్‌ (25)గా గుర్తించారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తిరుపతి వైపు నుంచి పిఠాపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Advertisment
తాజా కథనాలు