Andhra Pradesh Elections: ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని, మరోసారి అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న తెలుగుదేశం పార్టీ.. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ప్రధానంగా బీసీల ఓట్లపై దృష్టి సారించింది. ఈసారి బీసీలు తమ పార్టీలను ఆదరిస్తారని ఆశతో ఉన్న టీడీపీ(TDP).. వారిని తమవైపు తిప్పుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే నెల అంటే జనవరి 4వ తేదీన ‘జయహో బీసీ(Jayaho BC)’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జనవరి 4వ తేదీ నుంచి జయహో బీసీ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. బీసీలు బలహీనులు కాదు – బలవంతులన్న నినాదంతో ముందుకెళ్తామన్నారు. వైసీపీ హయాంలో బీసీలకు జరిగిన అన్యాయాలపై అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు లోకేష్. రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత బీసీలపై దాడులు పెరిగాయని, కేసులతో బీసీలపై దౌర్జ్యం చెలాయిస్తున్నారని ఆరోపించారు లోకేష్. అంతేకాదు.. సీఎం జగన్ బీసీల ద్రోహి అంటూ ఓ రేంజ్లో కామెంట్స్ చేశారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: టీడీపీ బీసీ మంత్రం.. జనవరి 4 నుంచి ‘జయహో బీసీ’..
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది రాజకీయ మరింత వేడెక్కుతోంది. బీసీల ఓట్లే లక్ష్యంగా ప్రతిపక్ష టీడీపీ పావులు కదుపుతోంది. జనవరి 4వ తేదీ నుంచి 'జయహో బీసీ' కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, తొలి విడతలో క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలు పర్యటిస్తారని నారా లోకేష్ ప్రకటించారు.
Translate this News: