Anasuya : విజయ్ దేవరకొండతో వివాదం.. మరోసారి స్పందించిన అనసూయ, ఈసారి ఏం చెప్పిందంటే?

నటి అనసూయ విజయ్ దేవరకొండతో వివాదంపై మరోసారి స్పందించారు.'సింబా' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.."నేను ఈ విష‌యంపై స్పందించాలి అనుకోట్లేదు. మా మ‌ధ్య అంతా పెద్ద గోడ‌వ జ‌ర‌గ‌లేదు. స్టేజీ మేనర్స్ గురించే ఆ రోజు మాట్లాడాను. అంతే త‌ప్ప నాకు ఎవ‌రు మీద కోపం లేదని చెప్పింది.

New Update
Anasuya : విజయ్ దేవరకొండతో వివాదం.. మరోసారి స్పందించిన అనసూయ, ఈసారి ఏం చెప్పిందంటే?

Actress Anasuya Bharadwaj : ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ - రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) మధ్య వివాదం మరో మలుపు తిరిగింది. ఇటీవల జరిగిన 'సింబా' సినిమా (Simbaa Movie) ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అనసూయ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 'సింబా' ట్రైలర్ లో ఒక సన్నివేశంలో, అనసూయ ఒక పాత్ర మహేష్ బాబు లేదా విజయ్ దేవరకొండ లాంటి భర్తను కోరుకుంటున్నట్లు చెబుతుంది. ఈ డైలాగ్ సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశమైంది.

అనసూయ స్పందన ఇదే...

ఈ వివాదం నేపథ్యంలో, అనసూయ తాజాగా మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చింది. "నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు. సినిమాలో ఒక సన్నివేశంలో భాగంగానే ఆ డైలాగ్ చెప్పాను. నిజానికి నేను ఈ విష‌యంపై స్పందించాలి అనుకోట్లేదు. సినిమాలో ఎలాగైతే సందేశం ఇస్తామో అలాగే నేను ఇవ్వాలి అనుకున్నాను.

Also Read : గేమ్ చేంజర్, రాజా సాబ్ సినిమాలపై అదిరిపోయే అప్డేట్స్ ఇచ్చిన థమన్..!

మా మ‌ధ్య అంతా పెద్ద గోడ‌వ జ‌ర‌గ‌లేదు. స్టేజీ మేనర్స్ గురించే ఆ రోజు మాట్లాడాను. లైమ్ లైట్‌లో ఉన్నప్పుడు పద్ధతిగా ఉండాలి. అది ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. అది లిమిట్స్ దాటిన‌ప్పుడు అందరికీ అర్థమవుతుంటాయ్. ఆరోజు ఎవ‌రు స్పందిచ‌క‌పోవ‌డంతో నేను మాట్లాడాల్సి వ‌చ్చింది. అంతే త‌ప్ప నాకు ఎవ‌రు మీద కోపం లేదు" అని తెలిపింది.

ఇక సింబా సినిమా విషయానికొస్తే.. జ‌గ‌ప‌తిబాబు, అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఈ మూవీ తెరకెకెక్కింది. ఈ సినిమాకు ముర‌ళి మ‌నోహ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. సంప‌త్ నంది, రాజేంద‌ర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఆగ‌ష్టు 09న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు