Encounter: ఛత్తీస్ ఘడ్ లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య కాల్పులు.. ఐదుగురు మృతి!

ఛత్తీస్ ఘడ్ అడవుల్లో శుక్రవారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య బీకరపోరు జరిగింది. ఇరు వర్గాలు ఎదురుపడటంతో ఎదురుకాల్పులు జరుపుకున్నారు. ఇందులో 5గురు మావోయిస్టులు మృతి చెందగా.. 3గురు పోలీసు అధికారులు గాయపడ్డారు. మరింత సమాచారం తెలియాల్సివుంది.

Encounter: ఛత్తీస్ ఘడ్ లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య కాల్పులు.. ఐదుగురు మృతి!
New Update

Chhattisgarh Encounter: ఛత్తీస్ ఘడ్ అడవుల్లో మరోసారి తుపాకుల మోత మోగుతోంది. శుక్రవారం సాయంత్రం నారాయణ్ పూర్ జిల్లా, ధంతే వాడ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన గోవెల్ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. 5గురు మావోయిస్ట్ లు మృతి చెందగా.. ముగ్గురు డీఆర్ జీ జవాన్ లకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రత్యేక వాహనంలో ఆస్పత్రికి తరలించినట్లు తెలిపిన పోలీసులు.. మావోయిస్టుల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

Also Read: మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రత్యేక అతిథులు.. లిస్ట్ చూస్తే ఆశ్యర్యపోతారు!

#chhattisgarh #encounter #maoist
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe