IPL 2024 : ధోని మళ్ళీ ఐపీఎల్ ఆడటం వాళ్ళ చేతుల్లోనే ఉంది : అంబటి రాయుడు

ఐపీఎల్ లేటెస్ట్ సీజన్ లో చెన్నైప్లే ఆఫ్స్ కి వెళ్ళకపోవడం నేపథ్యంలో నెక్స్ట్ సీజన్ లో మళ్ళీ ధోని ఆడటం చూస్తామా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవ్వగా.. అంబటి రాయుడు మాత్రం కచ్చితంగా ధోని ఆటను మళ్ళీ చూస్తామని, కాకపోతే అది BCCI చేతుల్లోనే ఉందని చెప్పాడు.

IPL 2024 : ధోని మళ్ళీ ఐపీఎల్ ఆడటం వాళ్ళ చేతుల్లోనే ఉంది : అంబటి రాయుడు
New Update

Ambati Rayudu About MS Dhoni : ఐపీఎల్ (IPL 2024) లేటెస్ట్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్లే ఆఫ్స్ కి వెళ్ళకపోవడం ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ విషయంలో బాగా డిసప్పాయింట్ అయిన వారిలో మాజీ చెన్నై ఆటగాడు అంబటి రాయుడు (Ambati Rayudu) కూడా ఉన్నాడు. ఆ మ్యాచ్ ఓడిపోవడంతో రాయుడు భావోద్వేగానికి సైతం లోనయ్యాడు.

అయితే చెన్నై ఓడిపోయిన నేపథ్యంలో నెక్స్ట్ సీజన్ లో మళ్ళీ ధోని ఆడటం చూస్తామా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవ్వగా.. రాయుడు మాత్రం కచ్చితంగా ధోని (Dhoni) ఆటను మళ్ళీ చూస్తామని, కాకపోతే అది BCCI చేతుల్లోనే ఉందని చెప్పడం గమనార్హం.

Also Read : బెంగ‌ళూరు, చెన్నై మ్యాచ్‌లో డ్యాన్స్ తో అదరగొట్టిన అందాల భామ.!

ధోని వచ్చే సీజన్ లో కచ్చితంగా ఆడతాడు.. కానీ?

" ధోనికి ఇది లాస్ట్ మ్యాచ్ అని నే అనుకోవడం లేదు. ఆయన క్రికెట్ కి ముగింపు పలకకూడదని గట్టిగా కోరుకుంటున్నా.. RCB తో మ్యాచ్ ఎండింగ్ లో అవుట్ అవ్వడంతో ధోని కాస్త నిరుత్సాహానికి లోనయ్యాడు. గతంలో అతన్ని అలా ఎప్పుడూ చూడలేదు.

ధోని గురించి మీకెవ్వరికీ తెలీదు. కచ్చితంగా నెక్స్ట్ సీజన్ లో గ్రౌండ్ లోకి దిగుతాడు. ఇంపాక్ట్ రూల్ తో అతఃని ఆటను మళ్ళీ చూసే ఛాన్స్ ఉంది. అయితే ఈ రూల్ ను BCCI కొనసాగిస్తేనే అది జరుగుతుంది. మేమంతా ధోని ఆటను మళ్ళీ చూడాలని కోరుకుంటున్నాం. కాబట్టి అది ఇప్పడు BCCI నిర్ణయంపైనే ఆధారపడి ఉంది" అని తెలిపాడు.

#bcci #ms-dhoni #ambati-rayudu #ipl-2024
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe