Akkineni Nagarjuna: ప్లీజ్ పుకార్లు ఆపండి.. N-కన్వెన్షన్ ఇష్యూపై నాగార్జున పోస్ట్!

N-కన్వెన్షన్ కూల్చివేతపై నటుడు నాగార్జున మరోసారి స్పందించారు. దీనిపై వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలు ఎక్కువ ఉన్నాయన్నారు. 'న్యాయస్థానం తీర్పుకు కట్టుబడి ఉంటాను. అప్పటివరకు పుకార్లు, అవాస్తవాలు నమ్మొద్దని ప్రజలను సవినయంగా అభ్యర్ధిస్తున్నా' అన్నారు.

New Update
Happy Birthday Nagarjuna: ఆరుపదుల నవమన్మధుడు. టాలీవుడ్ కింగ్

Akkineni Nagarjuna: N-కన్వెన్షన్ కు సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయని నటుడు అక్కినేని నాగార్జున అసహనం వ్యక్తం చేశారు. కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి. ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని Special Court, AP Land Grabbing (Prohibition) Act, 24-02-2014న ఒక ఆర్డర్ Sr 3943/2011 ద్వారా జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం గౌరవ హైకోర్టుని ఆశ్రయించటం జరిగింది. న్యాయస్థానం తీర్పుకు నేను కట్టుబడి ఉంటాను. అప్పటి వరకు ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని నేను మిమ్మల్ని సవినయంగా అభ్యర్ధిస్తున్నానంటూ వివరించారు.

#n-convention #akkineni-nagarjuna #cm-revanth
Advertisment
తాజా కథనాలు