Delhi: ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ

9 రాష్ట్రాలకు ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షులను ప్రకటించింది ఏఐసీసీ. తెలంగాణ ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా యడవల్లి వెంకటస్వామిని నియమించింది.ఇప్పటి వరకు తెలంగాణ ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా పనిచేసిన బల్మూర్ వెంకట్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అందుకే కొత్త అధ్యక్షుడిని నియమించినట్లు తెలుస్తోంది.

New Update
Delhi: ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ

NSUI Presidents: తెలంగాణతో పాటూ మరో ఎనిమిది రాష్ట్రాలకు రాష్ట్రాల ఎన్ఎస్యూఐ అధ్యక్షులను ఏఐసీసీ ప్రకటించింది. ఇందులో తెలంగాణ ఎన్ఎస్యూఐ యూనిట్ ప్రెసిడెంట్ గా యడవల్లి వెంకట స్వామి నియమించింది. ఈయనతో పాటూ బీహార్ కు జయశంకర్ ప్రసాద్..చంఢీఘడ్‌ కు సికందర్ బూరా..ఢిల్లీకి ఆశిష్ లంబా..హిమాచల్ ప్రదేశ్‌కు అభినందన్ ఠాకూర్..జార్ఖండ్‌కు బినయ్ అరోరా..మణిపూర్‌‌కు జాయ్ సన్..ఒడిశాకు ఉదిత్ నారాయణ్ ప్రధాన్..వెస్ట్ బెంగాల్‌కు ప్రియాంక చౌదరీలను అధ్యక్షులుగా నియమించారు.

publive-image

Also Read: Andhra Pradesh: ఏపీలో తెలంగాణ ఉద్యోగుల రిలీవ్

Advertisment
తాజా కథనాలు