Nellore:నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ.

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావలి టోల్ ప్లాజా దగ్గర ఓ ప్రవైట్ బస్సును లారీ ఢీకొట్టింది. ఇందులో ఏడుగురు మృతి చెందగా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Nellore:నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ.
New Update

Accident At kavali Toll Plaza:నెల్లూరు జిల్లా కావలి, ముసునూరు టోల్ ప్లాజా దగ్గర ఓ ప్రవైట్ బస్సు, లారీ గుద్దుకున్నాయి. అర్ధరాత్రి రెండు గంటలు సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా మరో 15 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే ఇందులో మొదట ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సు కూడా రావడంతో ప్రమాదం పెద్దగా జరిగింది. బస్సు ముందు భాగం అంతా నుజ్జు నుజ్జు అయింది.

publive-image

కావేరీ ట్రావెల్స్ బస్సు...

ప్రమాదం పాలైన బస్సు కావేరీ ట్రావెల్స్ కు చెందినదిగా గుర్తించారు. ఇది చెన్నై నుంచి హైదరాబాద్ వస్తోంది. ప్రమాదం సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేటపట్టారు. క్షతగాత్రలను ఆసుపత్రికి తరలించారు. కొంతమంది ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందగా...ఒక మహిళ, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రెండు లారీల డ్రైవర్లు, బస్సు డ్రైవర్ కూడా అక్కడిక్కడే మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత అవకాశం ఉందని తెలుస్తోంది.

publive-image

గాయపడిన వారి వివరాలు..
చంద్ర శేఖర్(37)..
సురేష్..(32)
గోపి నాథ్ (23)
మనోజ్ (23)
రాజ్ కుమార్ (38)
ఎస్.రమణ (38)
పవన్ (23)
ధనవేశ్వర్ (28)
రణధీర్ (31)
త్రికరణ్ (46)
శ్వేతా (19)
అజిత (30)
కన్నన్ (50)
రూప( 30)
మైథిలి (35)
అక్షయ్ (34)
గణేష్(51)
నితీష్ (20)..
లోకేష్ (35)
లక్ష్మీ (34)
కమలమ్మ (63)
నిర్మల(49)
కేశవ్(39).

#nellore #accident #lorry #kavali-toll-plaza #private-bus
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి