Andhra Pradesh: సెప్టిక్‌ ట్యాంక్‌ గొయ్యిలో ఇరుక్కుని యువకుడు మృతి..

అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో సెప్టెక్‌ ట్యాంక్ గొయ్యి తవ్వుతూ ఇసుక మేటల్లో పడి రంగాల జగదీష్ (28) అనే యువకుడు మృతి చెందడం కలకలం రేపింది. రెండు గంటల పాటు శ్రమించి జేసీబీ సాయంతో స్థానికులు జగదీష్ మృతదేహాన్ని బయటికి తీశారు.

Andhra Pradesh: సెప్టిక్‌ ట్యాంక్‌ గొయ్యిలో ఇరుక్కుని యువకుడు మృతి..
New Update

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో విషాదం చోటుచేసుకుంది. సెప్టిక్‌ ట్యాంక్ గొయ్యి తవ్వుతుండగా.. ఇసుక మేటల్లో పడి రంగాల జగదీష్ (28) అనే యువకుడు మృతిచెందాడు. జేసీబీ సాయంతో గ్రామస్థులు ఇసుక మేటలు తవ్వారు. సుమారు రెండు గంటల పాటు శ్రమించి జగదీష్ మృతదేహాన్ని స్థానికులు బయటకు తీశారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై గవర్నర్ సీరియస్

కొడుకు జగదీష్ మృతితో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. దీంతో రాజయ్యపేట గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. జగదీష్ బంధు, మిత్రుల ఆవేదనను చూసి స్థానికులు కంటతడిపెడుతున్నారు.

Also Read: జగనన్న వదిలిన బాణం షర్మిల దారి ఇప్పుడెటు!

#septic-tank #ap-crime-news #crime-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe