హోటల్లో రెచ్చిపోయిన కామాంధులు.. ఒకేసారి ఐదుగురు కలిసి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఓ మహిళను సాముహిక అత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. హోటల్‌లో పనిచేస్తున్న ఆమెను అక్కడే పనిచేస్తున్న ఐదుగురు వ్యక్తులు చుట్టుముట్టి కొట్టి దారుణానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.

New Update
హోటల్లో రెచ్చిపోయిన కామాంధులు.. ఒకేసారి ఐదుగురు కలిసి

దేశంలో మహిళల రక్షణకోసం ఎన్ని కొత్త చట్టాలు తెచ్చినా అత్యాచారాలు ఆగట్లేదు. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట స్త్రీలపై లైంగిక దాడి జరుగుతూనే ఉంది. వయసుతో సంబంధం లేకుండా మూడేళ్ల పసిపిల్లలు, స్కూల్ స్టూడెంట్స్, వృద్ధ మహిళపై అగయిత్యాలకు పాల్పడుతున్నారు కామాంధులు. ఇటీవలే స్కూల్ టాయిలెట్‌లో బాలికపై ఉపాధ్యాయులు లైంగిక దాడి చేసిన ఘటన మరువకముందే మరో మహిళను సాముహిక అత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

Also read :ఫోన్‌ మైకంలో ఉంటే ఇలాంటి ఘటనలే జరుగుతాయి.. వైరల్ అవుతున్న సజ్జనార్ వీడియో

ఈ మేరకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్రలోని ఓ హోటల్‌లో ఒక మహిళా కొంతకాలంగా పనిచేస్తుంది. అయితే ప్రతిరోజులాగే సదరు మహిళ తనపని తానుచేసుకుంటుండగా శనివారం రాత్రి అందులో పనిచేసే కొంతమంది పురుషులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి వేళ బాధితురాలి నుంచి మాకు ఫోన్‌ కాల్‌ రావడంతో హోటల్‌ వద్దకు వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకున్నాం. ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే బాధితురాలిని ముందుగా అదే హోటల్‌లో ఉద్యోగులుగా పనిచేస్తున్న ఐదుగురు వ్యక్తులు ఆమెను చుట్టుముట్టి కొట్టినట్లుగా వీడియోలో రికార్డయినట్లు ఆగ్రా సదర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏసీపీ అర్చనా సింగ్‌ తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీపీ తెలిపారు. అలాగే గతంలోనూ ఈ హోటల్‌లో ఇలాంటి సంఘటనలేమైనా జరిగాయా అనే కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు