Andhra Pradesh : కేబుల్ ఆపరేటర్ ఘాతుకం.. వృద్ధురాలి ఇంట్లో చొరబడి.. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని గోవింద్ అనే కేబుల్ ఆపరేటర్.. లక్ష్మీ నారాయణమ్మ (67) అనే వృద్ధురాలి ఇంట్లోకి ప్రవేశించి.. ఆమె మెడకు టవల్ చుట్టి హత్యాయత్నం చేశాడు. ఆమె స్పృహతప్పి పడిపోవడంతో తన ఒంటిపై ఉన్న 8 తులాల బంగారు గోలుసును ఎత్తుకెళ్లాడు. By B Aravind 29 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Cable Operator : విశాఖపట్నం జిల్లా(Visakhapatnam District) అనకాపల్లి(Anakapalle) లోని గవరపాలెం పార్క్ సెంటర్లో ఓ వ్యక్తి ఘాతుకానికి పాల్పడ్డారు. లక్ష్మీ నారాయణమ్మ(Lakshmi Narayanamma) (67) అనే వృద్ధురాలి ఇంట్లోకి గోవింద్(Govind) అనే కేబుల్ ఆపరేటర్(Cable Operator) ప్రవేశించి ఆమె ఒంటిపై ఉన్న 8 తులాల బంగారు చైన్ను దొంగిలించి(Theft Gold Chain) పరారయ్యాడు. ముందుగా ఆమె మెడకు టవల్తో బిగించి హత్యాయత్నం చేశారు. నారాయణమ్మ స్పృహ తప్పి పడిపోవడంతో.. ఆమె బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. అయితే పండగ కోసం పుట్టింటికి వచ్చిన వృద్ధురాలు చిన్న కూతురు.. స్పృహ తప్పి ఉన్న ఆమెను చూసి షాకైపోయింది. Also Read: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టీఎస్ఆర్టీసీలో జాబ్స్ దీంతో వెంటనే అనకాపల్లి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. ఒంటిపై గాయాలు ఉండటం చూసిన ఆమె కొడుకు కిషోర్ ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. అందులో రికార్డైన సంఘటనను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాయపడిన వృద్ధురాలికి మెరుగైన చికిత్స కోసం వైజాగ్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. Also Read: కడప రాజకీయాల్లో సంచలనం.. షర్మిలతో సునీత భేటీ. #robbery #theft-gold-chain #thief #telugu-news #visakhapatnam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి