Nizamabad: దారుణం.. రూ.500 కోసం ఇద్దరిని హత్య చేశాడు..

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌ మండలం మామిడిపల్లిలో దారుణం జరిగింది. రూ.500 రూపాయల కోసం ఇద్దరిని హత్య చేయడం కలకలం రేపింది. తాజాగా కోర్టు నిందితుడిగా యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధించింది.

New Update
AP: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌ మండలం మామిడిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఓ దుండుగుడు రూ.500 రూపాయల కోసం ఇద్దరిని హత్య చేయడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. వేల్పూర్ గ్రామానికి చెందిన నాగుల అనిల్‌ తన తల్లి రాజుబాయితో కలిసి బతుకుదెరువు కోసం మామిడిపల్లికి వచ్చారు. అక్కడ అనిల్‌కు.. ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న వరికుప్పల శ్రీనివాస్ పరిచయం అయ్యాడు. అయితే ఓరోజు శ్రీనివాస్ వద్ద అనిల్ రూ.500 అప్పుగా తీసుకున్నాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు డబ్బులు అడిగినా అనిల్ ఇవ్వలేదు. దీంతో 2021లో నవంబర్‌లో ఇద్దరిమధ్య గొడవ జరిగింది.

Also Read: గ్రూప్ 1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల

దీంతో గొడవపడ్డ రాత్రి శ్రీనివాస్ గొడ్డలి తీసుకొని అనిల్ ఇంట్లోకి వెళ్లి అతడిని నరికి చంపేశాడు. అడ్డువచ్చిన అనిత్‌ తల్లి రాజుబాయిని కూడా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఇక తెల్లవారుజామున స్థానికులు గమనించి జరిగిన విషయాన్ని అనిల్ బంధువులకు సమాచారం అందించారు. దీంతో వారు శ్రీనివాస్‌పై అనుమానంతో ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరికి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. నిందితుడు శ్రీనివాస్‌కు యావజ్జీవ కఠిన కారాగార శిక్షతోపాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి కుంచాల సునీత మంగళవారం తీర్పునిచ్చారు.

Also Read: హైదరాబాద్ ట్యాంక్ బండ్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. చివరికి ఏం జరిగిందంటే?

Advertisment
తాజా కథనాలు