Accident : అమెరికాలో మరో తెలుగు వ్యక్తి దుర్మరణం..

అమెరికాలో మరో తెలుగు వ్యక్తి దుర్మరణం చెందారు. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన అబ్బరాజు పృథ్వీరాజ్ (30) అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ మృతి చెందారు.

Accident : అమెరికాలో మరో తెలుగు వ్యక్తి దుర్మరణం..
New Update

Road Accident In USA : అమెరికా(America) లో మరో తెలుగు వ్యక్తి దుర్మరణం చెందారు. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident) లో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన అబ్బరాజు పృథ్వీరాజ్ (30) అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌(Software Engineer) మృతి చెందారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. హైదరాద్‌లోని ఎల్బీనరగర్‌ పరిధి అలకాపురిలో విద్యుత్‌ శాఖ విశ్రాంత ఉద్యోగి అబ్బరాజు వెంకటరమణ కుటుంబం స్థిరపడింది. ఆయన రెండు సంవత్సరాల క్రితమే మృతి చెందారు. వెంకటరమణ కొడుకు పృథ్వీరాజ్‌ 8 ఏళ్లుగా అమెరికాలోని నార్త్ కరోలినాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. గత ఏడాదే అతనికి వివాహం అయ్యింది.

Also read: బీజేపీ కార్పొరేటర్ కిడ్నాప్ కేసులో మరో ట్విస్ట్..

బుధవారం భార్యతో కలిసి కారులో వెళ్తుండగా.. వర్షం కారణంగా ముందు వెళ్తున్న మరో కారును ఢీకొని పల్టీలు కొట్టింది. తమ కారులో ఉన్న బెలూన్లు తెరుచుకోవడం వల్ల దంపతులిద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. భార్యను కారులోనే కూర్చోబెట్టి.. బయటికి వచ్చిన పృథ్వీరాజ్‌ ప్రమాదం జరిగిన ఘటనపై పోలీసులకు ఫోన్ చేస్తుండగా.. వేగంగా వచ్చిన మరో కారు ఆయన్ని ఢీకొట్టింది. దీంతో ఘటనాస్థలంలోనే పృథ్వీరాజ్‌ ప్రాణాలు కోల్పోయాడు. శవ పరీక్ష అనంతంర ఆయన మృతదేహాన్ని ఆదివారం హైదరాబాద్‌(Hyderabad) కు తీసుకురానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Also Read: శ్రవణ్‌ కిడ్నాప్‌ కేసులో ట్విస్ట్‌.. 2 గంటల పాటు సినిమా స్టైల్‌లో హైడ్రామా..!

#usa #telugu-news #road-accident #telangana-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe