AP Crime News: ప్రొద్దుటూరులో భగ్గుమన్న పాత కక్షలు.. నడి రోడ్డుపై వేట కొడవలితో దాడి

కడప జిల్లాలో ఓ వ్యక్తిపై వేటకొడవలితో దాడి చేయడం కలకలం రేపుతోంది. వైసీపీ బస్సు యాత్ర నేపథ్యంలో ప్రొద్దుటూరులో బెనర్జీ అనే యువకుడిపై టీడీపీ ఇంఛార్జి అనుచరుడు భరత్ దాడి చేసి పరారయ్యాడు. ప్రస్తుతం బాధితుడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

New Update
హైదరాబాదులో దారుణం.. మహిళను కారుతో ఢీ కొట్టి..!

వైసీపీ బస్సు యాత్ర నేపథ్యంలో కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో దారుణం చోటుచేసుకుంది. గాంధీ రోడ్డులోని మెడినోవా ఆస్పత్రి సర్కిల్ ప్రధాన రోడ్డుపై బెనర్జీ అనే యువకుడిపై భరత్ అనే వ్యక్తి వేటకొడవలితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి నిందితుడు పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన బెనర్జీని గాంధీ రోడ్డులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడు బెనర్జీ.. నందం సుబ్బయ్య హత్య కేసులో నిందితుడని పోలీసులు తెలిపారు. అలాగే అనుచరుడు భరత్ టీడీపీ ఇంఛార్జి ప్రవీణ్ అనుచరుడిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Also read: మీకు దమ్ముంటే ఆధారాలు బయటపెట్టండి: నారా లోకేష్

Advertisment
తాజా కథనాలు