Hyderabad: మూడంతస్తుల బిల్డింగ్‌పై నుంచి పడ్డ కానిస్టేబుల్.. చివరికి

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఓ హెడ్‌కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడి మృతి చెందారు. ఓ సీఐ పుట్టినరోజు వేడుక సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ డేవిత్‌.. స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లారు. ఆదివారం రాత్రి డిన్నర్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

New Update
Rajasthan: కోటాలో ఆగని ఆత్మహత్యలు.. మరో విద్యార్థి బలవన్మరణం..

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఓ హెడ్‌కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడి మృతి చెందారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. రాచకొండ కమిషనరేట్ కంట్రోల్‌ రూమ్‌లో సీఐగా పనిచేస్తున్న శేఖర్‌ పుట్టినరోజు వేడుక సందర్భంగా హెడ్‌ కానిస్టేబల్‌ డేవిత్‌తో పాటు 30 మంది స్నేహితులు అక్కడికి వెళ్లారు. ఆదివారం రాత్రి పార్టీలో డిన్నర్ చేస్తుండగా.. డేవిడ్ ప్రమాదవశాత్తు మూడవ అంతస్తు నుంచి కిందపడిపోయారు. ఆయన తలకు బలమైన గాయం కావడంతో అక్కడిక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: బీజేపీలోకి కోమటిరెడ్డి.. RTVతో బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి సెన్సేషనల్ ఇంటర్వ్యూ!

Advertisment
తాజా కథనాలు