Hyderabad: దారుణం.. కారులో లభ్యమైన మృతదేహం..

హైదరాబాద్‌లోని మణికొండలో ఓ కారులో మృతదేహం లభ్యం కావడం కనిపించడం రేపుతోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు చనిపోయిన వ్యక్తి మణికొండకు చెందిన ఆటోడ్రైవర్‌ రమేష్‌గా గుర్తించారు. ఇది ఆత్మహత్యనా లేదా హత్యనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Hyderabad: దారుణం.. కారులో లభ్యమైన మృతదేహం..

హైదరాబాద్‌లోని మణికొండలో ఓ కారులో మృతదేహం కనిపించడం కలకలం రేపుతోంది. మారుతి వ్యాన్‌లో మృతదేహం ఉండటం చూసిన స్థానికులు ఒక్కసారిగా కంగుతిన్నారు. దీంతో వెంటనే పోలీసులు సమాచారం మేరకు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read: రష్యాలో భారత దౌత్య కార్యాలయంలో పాకిస్థాన్ గూఢచారి..

అయితే ఆ మృతదేహం కారు డ్రైవర్ వెనక సీటులో కనిపించింది. అతడు మణికొండకు చెందిన ఆటోడ్రైవర్‌ రమేష్‌గా గుర్తించారు. శనివారం అతడు స్నేహితులతో కలిసి యాదగిరిగుట్టకు వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత స్నేహితులతో అతడికి గొడవ జరిగినట్లు సమాచారం. అయితే రమేశ్ హత్యకు గురయ్యాడా? లేక అనారోగ్యంతో మృతి చెందాడా? లేదా ఆత్మహత్యనా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Also Read: కేసీఆర్ దుర్మార్గుడు… చేసిన పాపాలకు లెక్కలు లేవు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు