Kerala: బాలికపై 80 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు!

పద్నాలుగేళ్ల బాలికపై ఎనభై ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన 2021 కేసులో కేరళ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుడికి 45 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అతను 20 ఏళ్లపాటు జైలులోనే ఉండాలని స్పష్టం చేసింది న్యాయస్థానం.

Kerala: బాలికపై 80 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు!
New Update

Rape case: బాలికపై అత్యాచారానికి పాల్పడిన వృద్ధుడి కేసులో కేరళ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అభం శుభం తెలియని మైనర్ అమ్మాయిని బెదిరించి లైంగిక దాడికి పాల్పడినందుకుగానూ మొత్తం 45 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాదు ఈ కేసులో నిందితుడు 20 ఏళ్లపాటు జైలులోనే ఉండాలని స్పష్టం చేసింది.

తండ్రి చనిపోవడం, తల్లి విడిచిపెట్టడంతో..

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళలోని ఇడుక్కి ప్రాంతంలో 2021లో ఈ సంఘటన జరిగింది. తండ్రి చనిపోవడం, తల్లి విడిచిపెట్టి వెళ్లిపోవడంతో ఓ బాలిక (14) తన బంధువుల ఇంట్లో ఉంటోంది. అయితే ఈ క్రమంలోనే ఆ ఇంటికి దగ్గరలోనే కిరాణం షాపు నిర్వహిస్తున్న 80 ఏళ్ల వృద్ధుడు బాలికపై కన్నేశాడు. చిన్న చిన్న అవసరాల కోసం తన షాపుకు వచ్చే అమ్మాయితో చనువుగా ఉంటూ మచ్చిక చేసుకున్నాడు. ఇదే క్రమంలో బాలిక నివసించే ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చొరబడిన వృద్ధుడు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఇది కూడా చదవండి : Vishaka: ఆంధ్రా యూనివర్సిటీలో గంజాయి లభ్యం.. అదుపులో ఏడుగురు విద్యార్థులు!

ఈ విషయం ఎవరికి చెప్పొద్దంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇదే అదనుగా పలుసార్లు లైంగిక దాచి చేశాడు. కొన్నాళ్లకు అసలు విషయం బయటపడటంతో వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తాజాగా ఈ కేసు విచారించిన ఇడుక్కి ఫాస్ట్‌ట్రాక్‌ స్పెషల్‌ కోర్టు అతనికి తగిన శిక్ష విధించింది. ఈ తీర్పుపై బాలిక బంధువులు ఆనందం వ్యక్తం చేశారు.

#kerala #45-years-imprisonment #sexually-assaulted #80-year-old-man #14-year-old-girl
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe