Accident : ఘోర ప్రమాదం.. ఐదుగురు విద్యార్థులు మృతి

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముస్సోరి - డెహ్రాడూన్ మార్గ్‌ ఝడిపానీ రోడ్‌లోని.. పానీ వాలా బండ్‌ సమీపంలో ఓ కారు అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

Accident : ఘోర ప్రమాదం.. ఐదుగురు విద్యార్థులు మృతి
New Update

Uttarakhand : ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ముస్సోరి - డెహ్రాడూన్ మార్గ్‌ ఝడిపానీ రోడ్‌లోని.. పానీ వాలా బండ్‌ సమీపంలో ఓ కారు అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు డెహ్రాడున్ ఐఎంఎస్ కళాశాలకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డెహ్రాడున్‌ IMS కాలేజీ(Dehradun IMS College) లో చదువుతున్న ఆరుగురు విద్యార్థులు విహార యాత్ర(Excursion) కోసం ముస్సోరికి వెళ్లారు.

Also Read: భార్యతో అసహజ శృంగారం నేరం కాదు: హైకోర్టు

ఆ ఆరుగురు విద్యార్థుల్లో నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. అయితే వీళ్లు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పింది(Car Accident). దీంతో కారు లోయలోకి పడిపోవడంతో.. ఐదుగురు విద్యార్థులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో నాన్సీ అనే యువతి తీవ్రంగా గాయాలపాలైంది. ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి ఇప్పుడు సీరియస్‌గా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Also Read: భార్యను కొట్టి చంపిన ఆర్థిక మంత్రి.. వీడియో వైరల్

#car-accident #telugu-news #uttarakhand
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe