Fake cerificates: దేశంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే విద్యావ్యవస్థ ఎటువైపు పయనిస్తుందోనని అనుమానంగా ఉంది. నిన్న, మొన్నటి వరకు నీట్ ప్రశ్నా పత్రాల లీకేజీ, నెట్ ఎగ్జామ్లో అవకతవకలతో హోరెత్తిపోయింది. ఇప్పుడు తాజాగా ఫేక్ సర్టిఫికెట్ల అంశం ఆందోళన రేపుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 43 వేల దొంగ సర్టిఫికెట్లను జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్లోని చూరూలో ఓం ప్రకాశ్ జోగేందర్ సింగ్ (OPJS) ప్రైవేటు యూనివర్సిటీ నిర్వాకం బయటపడింది. తప్పుడు డిగ్రీలతో పాటు మునుపటి తేదీలతో డిగ్రీలు ఇచ్చిందని ఈ యనివర్శిటీ మీద ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్ని వేల ఫేక్ సర్టిఫికేట్లను జారీ చేశారన్న విషయాలపై కూపీలు లాగుతున్నారు.
పూర్తిగా చదవండి..Rajasthan: రాజస్థాన్లో ఫేక్ సర్టిఫికేట్ల కలకలం..43వేల తప్పుడు సర్టిఫికేట్లు
రాజస్థాన్లోని ఓం ప్రకాశ్ జోగేందర్ సింగ్ ప్రైవేటు యూనివర్శిటీలో ఫేక్ సర్టిఫికేట్ల అంశం కలకలం రేపుతోంది. ఏకంగా 43,409 డిగ్రీ ఫేక్ సర్టిఫికేట్లను జారీ చేసింది ఆ యూనివర్శిటీ. రాజస్తాన్లోని చూరూలో ఉంది ఇది. దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Translate this News: