Tamilnadu : భారీ బాంబు పేలుడు.. నలుగురు మృతి

తమిళనాడులో దారుణం జరిగింది. విరుదనగర్ జిల్లా రియాపట్టి శివారులోని అవియార్‌ క్వారీలో పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Tamilnadu : భారీ బాంబు పేలుడు.. నలుగురు మృతి
New Update

Bomb Explosion : తమిళనాడు(Tamilnadu) లో దారుణం జరిగింది. విరుదనగర్ జిల్లా రియాపట్టి శివారులోని అవియార్‌ క్వారీలో పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రాళ్లను పగలగొట్టేందుకు ఉపయోగించే పేలుడు పదార్థాలు(Explosives) ఒక్కసారిగా పేలిపోయాయి. క్వారీలో రాళ్ల నుంచి సిల్డ్, ఎమ్‌ ఇసుక లాంటి పదార్థాలు విరిగిపోతాయి. క్రషర్‌లో రాళ్లను పగలగొట్టేందుకు పేలడు పదార్థాలను ఉపయోగిస్తారు.

Also Read: కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ.. టెన్షన్ వద్దంటున్న నిపుణులు 

అయితే ఉదయం క్వారీ సమీపంలో ఓ గదిలో బండరాళ్లను పేల్చే పేలుడు పదార్థాలు పేలిపోయాయి. ఈ ప్రమదం వల్ల అటవీ ప్రాంతం(Forest Area) లో అక్కడక్కడా కొందరు చెల్లాచెదురూగా పడిపోయారు. పేలుడు పదార్థాలు ఉన్న భవనం సమీపంలో రెండు వాహనాలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో నలుగురు చనిపోగా మరో 12 మంది గాయాలపాలయ్యారు. ప్రస్తుతం క్షతగాత్రలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: బీజేపీకి చుక్కలు చూపిస్తున్న ధ్రువ్ రాఠీ..అసలెవరితను?

#telugu-news #bomb-blast #tamil-nadu #explosives
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe