వివాహం అయ్యాక దంపతులు తమకు పిల్లలు కావాలని కోరుకుంటారు. అయితే కొన్ని జంటలకు త్వరగానే సంతానం కలుగుతుంది. మరికొందరికి చాలా ఏళ్లు పడుతుంది. అసలు సంతానమే కలగని దంపతులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులనే కొంతమంది దుండగులు టార్గెట్ చేశారు. పేద బాలికలకు డబ్బులు ఆశ చూపించి.. వారి నుంచి అండాలను సేకరిస్తున్నారు. ఆ తర్వాత వాటిని అమ్ముకుంటున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో చోటుచేసుకుంది. అయితే ఈ వ్యవహారంపై ఓ మహిళ పోలీసులు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. సంతానం కోసం ఐవీఎఫ్ కేంద్రాలకు వచ్చే దంపతులకు మైనర్ బాలికల అండాలు అమ్ముతున్నారని.. ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పూర్తిగా చదవండి..UttarPradesh: సంతానం లేని జంటకు మైనార్ బాలికల అండాలు అమ్ముతున్న ముఠా.. నలుగురు అరెస్టు
పేదింటి మైనర్ బాలికలకు డబ్బులు ఆశచూపి వారి అండాలను అమ్ముకుంటున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగింది. సంతానం కోసం ఐవీఎఫ్ కేంద్రాలకు వచ్చే దంపతులకు మైనర్ బాలికల అండాలు అమ్ముతున్నారని.. ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Translate this News: