Maharastra: పరీక్షలో చూపించలేదని కత్తితో దాడి చేసిన పదవతరగతి విద్యార్థులు

చిన్న పిల్లలు కూడా కిరాతకులుగా తయారువుతున్నారు. చిన్న చిన్న కారణాలకే హత్యలు చేస్తున్నారు. మహారాష్ట్రలో జరిగిన దారుణమే దీనికి ఉదాహరణ. పరీక్షలో చూపించలేదని ముగ్గురు విద్యార్ధులు కత్తితో దాడి చేశారు.

New Update
Maharastra: పరీక్షలో చూపించలేదని కత్తితో దాడి చేసిన పదవతరగతి విద్యార్థులు

10Th Class students: మహారాష్ట్రలో దారుణం జరిగింది. ముగ్గురు పదవ తరగతి విద్యార్ధులు తమ తోటి స్టూడెంట్ మీద విచక్షణారహితంగా దాడి చేశారు. అది కూడా పరీక్షల్లో ఆన్సర్లు చూపించడం లేదనే కారణంతో. మహారాష్ట్రాలోని భివాండీ పట్టణంలో చోటు చేసుకుందీ ఘటన. ప్రస్తుతం మహారాష్ట్రలో కూడా పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. మంగళవారం పరీక్ష ముగిసిన తర్వాత ఈ ఘటన జరిగింది. దాడి అనంతరం గాయపడిన విద్యార్ధిని స్థానికి ఆసుపత్రికి తరలించారు.

Also Read:Nirmala Sitharaman: పోటీ చేయడానికి పైసలు లేవంటున్న ఆర్థిక మంత్రి నిర్మలా.. అసలు ఆమె ఆస్తులు, అప్పులు ఎన్నో తెలుసా

పదవ తరగతి పరీక్షల్లో బాధిత విద్యార్ధి ఎంత చూపించమని అడిగినా...ఇతర విద్యార్ధులకు సమాధానాలు చూపించడానికి నిరాకరించాడు. దీంతో వాళ్లు అతని మీద కక్ష కట్టారు. ఆ కోపాన్ని తీర్చుకోవడానికే పరీక్ష రాసి బయటకు వచ్చిన బాధిత స్టూడెంట్ మీద ముగ్గురూ ఒకేసారి పడి కొట్టారు. దాని తర్వాత కత్తితో కూడా పొడిచారని పోలీసులు చెబుతున్నారు. దాడిలో గాయపడిన విద్యార్ధిని వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. బాధిత విద్యార్ధిని ఆసుపత్రి నుంచి కూడా డిశ్చార్జ్ చేశారు. దాడి చేసిన ముగ్గురు స్టూడెంట్స్ మీదా ఐపీసీ సెక్షన్ 324 కింద కేసు నమోదు చేశారు.

Also Read:Hyderabad: ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్..

Advertisment
తాజా కథనాలు