Drugs: విశాఖ తీరంలో 25 వేల కిలోల డ్రగ్స్ సీజ్‌

బ్రెజిల్‌ నుంచి విశాఖ తీరానికి వచ్చిన ఓ కంటైనర్‌లో ఏకంగా 25 వేల కిలోల డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా మార్చి 16న కంటైనర్‌ విశాఖపట్నానికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

New Update
Drugs: విశాఖ తీరంలో 25 వేల కిలోల డ్రగ్స్ సీజ్‌

25000 Kg Drugs Seized in Vishakhapatnam: విశాఖపట్నం తీరంలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. బ్రెజిల్‌ నుంచి విశాఖ తీరానికి వచ్చిన ఓ కంటైనర్‌లో ఏకంగా 25 వేల కిలోల డ్రగ్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంటర్‌పోల్ సమాచారంతో ఢిల్లీ సీబీఐ అధికారులు.. విశాఖపట్నంలో ఉన్న సీబీఐ, కస్టమ్స్ అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో ప్రత్యేక బృందాలు విశాఖ తీరానికి చేరుకున్నాయి. ఈనెల 19వ తేదీన నార్కోటిక్స్ సామగ్రి, పలువులు నిపణులతో సీబీఐ అధికారులు వచ్చి.. అక్కడ డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు.

25000 Kg Drugs Seized in Vishakhapatnam

Also read: జనసేన పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తల నిరసన..

ఆపరేషన్ గరుడలో భాగంగా ఆ 25 వేల కిలోల మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు. జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా మార్చి 16న కంటైనర్‌ విశాఖపట్నానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే ఓ ప్రైవేటు కంపెనీ 25 కిలోల చొప్పున 1000 బ్యాగుల్లో డ్రగ్స్ నింపి సరఫరా చేసినట్లు సమాచారం.

Also Read: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసానికి ఈడీ బృందం.!

Advertisment
తాజా కథనాలు