Andhra Pradesh : పల్నాడులో 144 సెక్షన్‌ అమలు

పల్నాడు జిల్లాలో ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలు రెండో రోజు కొనసాగడంతో ఎన్నికల సంఘం 144 సెక్షన్‌ అమలు కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా పాలనాధికారి శివశంకర్ పోలీసు శాఖకు ఉత్తర్వులిచ్చారు.

New Update
Andhra Pradesh : పల్నాడులో 144 సెక్షన్‌ అమలు

Palnadu : పల్నాడు జిల్లాలో ఎన్నికల(Elections) సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. రెండో రోజు కూడా ఇది కొనసాగడంతో ఎన్నికల సంఘం(Election Commission) 144 సెక్షన్‌ అమలు కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా పాలనాధికారి శివశంకర్ పోలీసు శాఖకు ఉత్తర్వులిచ్చారు. నరసరావుపేట లోక్‌సభ(Lok Sabha) స్థానంలో సహా.. వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, మాచర్ల, గురజాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.

Also Read: ఏపీలో పోలింగ్ శాతంపై అధికారిక ప్రకటన

ఈ ప్రాంతాల్లో ఎక్కడా కూడా ముగ్గురికి మించి గుమికూడదని.. సభలు, సమావేశాలు నిర్వహించకూడదని పోలీసులు సూచనలు చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే.. కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Also Read: తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి అరెస్ట్‌…!

Advertisment
తాజా కథనాలు