Telangana: ప్రైవేటు బస్సులో భారీ చోరీ.. రూ.12.80 లక్షలు కొట్టేసిన దుండగులు..

ముంబాయి నుంచి జగిత్యాలకు వస్తున్న ఓ ప్రైవేటు బస్సులో భారీ చోరి జరిగింది. బస్సు నిజామాబాద్‌ శివారు ప్రాంతంలో టీ తాగడం కోసం ఆపారు. దీంతో దుండగులు హనుమంతు అనే ప్రయాణికి బ్యాగును చోరీ చేశారు. అందులో రూ.12.80 లక్షలు ఉన్నాయని బాధితుడు వాపోయాడు.

Telangana: ప్రైవేటు బస్సులో భారీ చోరీ.. రూ.12.80 లక్షలు కొట్టేసిన దుండగులు..
New Update

నిజామాబాద్‌ జిల్లాలోని ఓ బస్సులో భారీ చోరీ జరిగింది. ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి నుంచి దుండగులు రూ.12.80 లక్షలు దొంగిలించారు. అసలేం జరిగిందంటే.. జగిత్యాలకు చెందిన హనుమంతు అనే ఓ వ్యక్తి ముంబయి నుంచి జగిత్యాలకు వచ్చే ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్నాడు. అయితే ఆ బస్సు నిజామాబాద్‌ శివారులోని సారంగపూర్‌ వద్ద ప్రయాణికులు టీ తాగడానికి ఆపారు. దీంతో ఇదే అదునుగా భావించిన దుండగులు దోపిడీ చేసేందుకు సిద్ధమయ్యారు.

Also Read: జవాన్ ప్రాణం తీసిన మాయదారి మాంజా.. రాష్ట్రంలోనూ పలు ఘటనలు

వెంటనే హనుమంతుకి ఉన్న బ్యాగును చోరీ చేశారు. అయితే ఆ బ్యాగులో రూ.12.80 లక్షలు ఉన్నాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బస్సులో సీసీ కెమెరాలు ఉన్నటికీ కూడా వాటికి చేయి అడ్డుపెట్టి దుండగులు చోరీ చేశారని పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మొగులయ్య పేర్కొన్నారు.

Also Read: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్.. చంపేస్తామంటూ వార్నింగ్

#telangana #telugu-news #robbery
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి