Breaking : జగన్‌కు బిగ్ షాక్.. ఎనిమిది జిల్లాల్లో వైసీపీకి '0' సీట్లు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎనిమిది జిల్లాల్లో వైసీపీ ఇంకా ఖాతా తెరవలేదు. గుంటూరు, తుర్పు గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కృష్ణా జిల్లాలో వైసీపీ అభ్యర్థులు ఎవరూ కూడా ఆధిక్యంలో లేరు.

New Update
Jagan: నేడు వినుకొండకు జగన్.. 144 సెక్షన్ అమలు!

Assembly Elections Results : ఏపీ (Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ (YCP) కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే 160 సీట్లకు పైగా ఆధిక్యంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి (TDP-Janasena-BJP) దూసుకుపోతోంది. వైసీపీ మాత్రం కేవలం 13 స్థానాల్లోనే మెజార్టీలో ఉంది. అయితే ఎనిమిది జిల్లాల్లో వైసీపీ ఇంకా ఖాతా తెరవలేదు. గుంటూరు, తుర్పు గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కృష్ణా జిల్లాలో వైసీపీ అభ్యర్థులు ఎవరూ కూడా ఆధిక్యంలో లేరు. 2019 ఎన్నికల్లో నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఎన్నికల్లో మాత్రం పూర్తిగా ఓటమి దిశగా వెళ్లడం.. ఆ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కనిపిస్తోంది.

Also read: ఎన్నో ఒడిదుడుకులు.. ఎన్నో అటుపోట్లు.. పవన్‌కు ఈ గెలుపు ఇలా దక్కిందంటే?

Advertisment
తాజా కథనాలు