నగ్నంగా కట్టేసి, కారంపొడి పోసి.. కూతురును ప్రేమించాడనే కోపంతో యువకుడిని చంపిన పేరెంట్స్

మరో కులానికి చెందిన యువకుడు తమ కూతురిని ప్రేమించాడనే కోపంతో ఓ కుటుంబం దారుణానికి పాల్పడింది. ఎన్నిసార్లు చెప్పినా ఆ అబ్బాయి తీరు మార్చుకోవట్లేదనే కోపంతో విచక్షణ రహితంగా దాడిచేసి చంపేశారు. ఈ దారుణమైన ఘటన మేడ్చల్‌ జిల్లా పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

New Update
నగ్నంగా కట్టేసి, కారంపొడి పోసి..  కూతురును ప్రేమించాడనే కోపంతో యువకుడిని చంపిన పేరెంట్స్

మరో కులానికి చెందిన యువకుడు తమ కూతురిని ప్రేమించాడనే కోపంతో ఓ కుటుంబం దారుణానికి పాల్పడింది. తమతో సంబధం కుదరని ఎన్నిసార్లు చెప్పినా ఆ అబ్బాయి తీరు మార్చుకోవట్లేదనే కోపంతో విచక్షణ రహితంగా దాడిచేసి చంపేశారు. ఈ దారుణమైన ఘటన హైదరాబాద్‌ శివారు మేడ్చల్‌ జిల్లా పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

ఈ మేరకు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్‌ సమీపంలోని అన్నోజిగూడ శ్రీలక్ష్మీనరసింహ కాలనీకి చెందిన కరణ్‌నాయక్‌(18) నీరు సరఫరా చేసే ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తండ్రి గతంలో మరణించగా తల్లి యాదిబాయ్‌తో కలిసి స్థానికంగా నివాసముంటున్నాడు. అయితే కరణ్‌కు అదే కాలనీలో ఉండే బాలిక(15)తో పరిచయడం ఏర్పడగా అది ప్రేమగా మారింది. వారిద్దరి సామాజిక వర్గాలు కలవకపోవడంతో విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు కరణ్‌ను మందలించారు. అయినా కరణ్‌ పదే పదే అమ్మాయిని దొంగచాటునా కలుస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో తల్లిదండ్రులకు కొద్దిరోజులుగా కోపంతో రగిలిపోయారు. సమయం కోసం వేసి చూస్తూ బుధవారం అర్థరాత్రి యువకుడిని అత్యంత కిరాతకంగా కొట్టి హత్య చేసినట్లు పోలీసులు వివరించారు.

Also read :సీఐ మర్మాంగాలు కోసి చంపిన కేసు.. కానిస్టేబుల్‌ దంపతుల అరెస్ట్‌

పథకం ప్రకారమే దాడి:
అయితే కొంతకాలంగా అవకాశం కోసం ఎదురుచూస్తున్న సదరు అమ్మాయి పేరెంట్స్ బుధవారం అర్ధరాత్రి ప్లాన్ ప్రకారమే యువకుడిపై అటాక్ చేశారు. అమ్మాయిని ఇంట్లోనే ఉంచి స్థానికంగా జరిగే ఓ శుభకార్యానికి వెళ్లారు దంపతులు. ఈ సమయంలోనే కరణ్‌ అర్ధరాత్రి నేరుగా ఇంటికెళ్లాడు. దీంతో ఇరుగుపొరుగు ద్వారా సమాచారం అందగానే బాలిక కుటుంబ సభ్యులు వెంటనే తిరిగివచ్చారు. కరణ్‌ తప్పించుకోకుండా ముందుగా బయట నుంచి గడియపెట్టారు. తమతో సన్నిహితంగా ఉండే వాళ్లను కొందరిని పిలుచుకుని ఒక్కసారిగా ఇంట్లోకి ప్రవేశి యువకుడిని దారుణంగా కొట్టారు. నగ్నంగా చేసి తాళ్లతో కట్టేశారు. అతడి రహస్యభాగాలపై కారం చల్లుతూ.. కర్రలతో కొడుతూ దాదాపు గంటపాటు చిత్రవధ చేశారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన కరణ్‌ కొద్దిసేపటికే మరణించాడు. ఈ క్రమంలో సమాచారం అందగానే ఇన్‌ఛార్జ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.మహేందర్‌రెడ్డి, ఎస్‌ఐ నాగార్జున్‌రెడ్డి ఘటనా స్థలికి చేరుకుని బాలిక తల్లిదండ్రులతో సహా మరో 9 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించినట్లు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు