Vijayasai Reddy : అంతు చూస్తా.. లోకేష్‌పై విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్

AP: వైసీపీ నేతలపై దాడులు జరగడంపై లోకేష్‌ను నిలదీశారు ఎంపీ విజయసాయి రెడ్డి. అంతు చూస్తా, పాదాలతో తొక్కెస్తా అంటే రాజకీయ కక్ష అనుకున్నామని...కానీ, నిజంగానే ప్రభుత్వం ఇంతటీ హింసకు దిగజారుతుందని అనుకోలేదన్నారు.

Home Minister Anita : విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చిన హోంమంత్రి అనిత
New Update

Vijayasai Reddy : టీడీపీ నేత, మంత్రి లోకేష్ పై విమర్శలు గుప్పించారు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి. టీడీపీ వాళ్ళు నడిరోడ్డు మీద పట్టపగలు వైసీపీ వాళ్ళను హతమారుస్తుంటే, వాటిని గురించి మాట్లాడకుండా, హంతకులు కూడా వైసీపీ వాళ్ళే అని అబద్ధాలతో ఎదురు దాడి చేస్తున్నారు. ఏ పార్టీ వాళ్ళైనా హత్యల్ని ఎలా సమర్దిస్తారు? రెడ్ బుక్ పేరుతో ఎంత కాలం ఈ రావణ దహనం? అని మంత్రి లోకేష్ ను ప్రశ్నించారు.

అంతు చూస్తా, పాదాలతో తొక్కెస్తా అంటే రాజకీయ కక్ష అనుకున్నామని అన్నారు. నిజంగానే ప్రభుత్వం ఇంతటీ హింసకు దిగజారుతాదని అనుకోలేదు, హోమ్ మంత్రి తుపాకి పట్టుకోవాలంటోందని చురకలు అంటించారు. ప్రజలే కాదు, పోలీస్ యంత్రాంగం కూడా బెంబేలెత్తిపోతోంది టీడీపీ హత్యారాజకీయాలతో అని ట్విట్టర్ (X)లో రాసుకొచ్చారు.

 Also Read : 🔴 Union Budget 2024 LIVE: మోదీ 3.0 మొదటి బడ్జెట్.. వరాల జల్లులు ఉంటాయా?




#ycp-vijayasai-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి